Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా జీవితాన్ని మార్చేసింది.. అదొక మ్యాజిక్.. అల్లు అర్జున్
Recommended Video
అల్లు అర్జున్ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం ఆర్య. సుకుమార్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. అల్లు అర్జున్ను లవర్ బాయ్గా, యువ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ సినిమాతో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకొన్నారు. ఆర్య సినిమా గురించి తన ఇన్సాటాగ్రామ్లో అల్లు అర్జున్ ఏం చెప్పారంటే..
ఇంకా నా మదిలో ఫీల్ ది లవ్..
ఇంకా నేను ఫీల్ ది లవ్ అనేది నా మనసు నుంచి వెళ్లలేదు. నా జీవితంలో ఆర్య సినిమా ఓ మ్యాజిక్ మూవీగా భావిస్తాను. నా జీవితాన్ని మార్చి వేసిన చిత్రం ఇది. సినిమా వచ్చి అప్పుడే 15 ఏళ్లు అయిపోయాయా అనే విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.
దిల్ రాజు, సుకుమార్ లేకుంటే
నా కెరీర్లో గొప్ప చిత్రం ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేల్, నిర్మాత దిల్ రాజుకు చాలా థ్యాంక్స్. వారు ఈ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేను. ఈ సినిమాతో నాకు గొప్ప గుర్తింపు వచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ను పెంచింది అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ప్రేక్షకుల ఆదరణ, ప్రేమను మాటల్లో చెప్పలేను
ముఖ్యంగా అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించిన తీరు అద్భుతంగా. నాపై కురిపించిన ప్రేమను ఇప్పటికీ మరిచిపోలేను అని అల్లు అర్జున్ అన్నారు. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్తో రూపొందిన ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నిఅందుకొన్న సంగతి తెలిసిందే.
రూ. 4 కోట్లతో రూ.30 కోట్ల వసూళ్లు
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఆర్య చిత్రంలో అను మెహతా, శివబాలాజీ నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం మే 7, 2004లో విడుదలైంది. 4 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు వసూలు చేసింది.