Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి భారీ బిజినెస్ కార్నివాల్.. 20 తేదీన షాపింగ్, ఫుడ్, లైవ్ మ్యూజిక్తో!
సినీ హీరోల భార్యలు స్వచ్చంద కార్యక్రమాలు, బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటారు. కొందరైతే తమ భర్తలు నటించే సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలు లేదా క్యాస్టూమ్స్ సెలెక్ట్ చేయడం లేదా వారి డేట్స్ చూడటం, నిర్మాతలు, దర్శకులతో కో ఆర్డినేట్ చేయడం చేస్తుండటం చూస్తూనే ఉంటాం. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా పలు రకాల వ్యాపకాలు, పేజ్ 3 ఈవెంట్లతో బిజీగా కనిపిస్తుంటారు. అయితే ఆమె ఇటీవల స్థాపించిన షికాబు సంస్థకు సంబంధించిన భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఆ వేడుక వివరాల్లోకి వెళితే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సోసైటీలో ఉన్న స్టేటస్కు తగినట్టుగానే అల్లు స్నేహారెడ్డి కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఆమె పాపులారిటీ చూస్తే ఏ సినీ సెలబ్రిటీకి తక్కువేం కాదనే ఫీలింగ్ కలిగిస్తుంటారు. ఆమె అందం, ఆలోచనా విధానం, ఇన్స్టాగ్రామ్లో ఆమె వ్యవహరించే తీరు, స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్తో మమేకమైన తీరు అందర్నీ ఆకట్టుకొంటాయి.

అలా పలు విషయాలతో బిజీగా ఉంటూ.. గృహిణి జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. సొసైటీతో భాగమై ఉంటారు. అలా తమ కుటుంబం వ్యాపార రంగాల్లో వ్యవహరించిన తీరు ఉన్నట్టే.. స్నేహారెడ్డి కూడా వ్యాపార రంగంలో తనదైన ముద్రను చూపిస్తున్నారు.

అల్లు ఫ్యామిలీ స్టాటస్కు తగినట్టే అల్లు స్నేహారెడ్డి పికాబు సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తరఫున సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ను జనవరి 20వ తేదీన హైదరాబాద్ మహానగరంలో గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ను గ్రాండ్గా సక్సెస్ చేయడానికి టాప్ స్టిచ్ అనే సంస్థతో జతకట్టింది.

హైదరాబాద్లోని N Convention లో జనవరి 20వ తేదీన జరిగే కార్నివాల్లో షాపింగ్ యాక్టివిస్ను ప్రారంభిస్తున్నారు. అలాగే రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్తో ఒక డిఫరెంట్ ఫీలింగ్ను ఆస్వాదించే విధంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











