Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్ను మిస్ అవుతున్నారట.. స్నేహా రెడ్డి పోస్ట్ వైరల్
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మొన్నటి న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ పార్టీల్లో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి రచ్చ చేశాడు. అయితే ఇప్పుడు బన్నీ మళ్లీ పుష్ప సినిమా కోసం ఇంటిని విడిచి అడువుల బాట పట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా అల్లు స్నేహా రెడ్డి ఓ క్యూట్ పిక్ను షేర్ చేసింది. అందులో బన్నీ తన పిల్లలిద్దరినీ తనతో కూర్చోబెట్టుకుని సినిమాను చూస్తున్నట్టున్నాడు.
తాజాగా బన్నీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఆహాలోని సామ్ జామ్ షోలో బన్నీకి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.ఫ్యామిలీ సీక్రెట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. ఇంట్లో బన్నీ ఎంత కమాండింగ్గా ఉంటాడు.. చిన్నతనంలో ఎన్ని వేషాలు వేశాడు.. ఇలా ఎన్నో సంగతులకు ప్రేక్షకులకు తెలిసిపోయాయి. అంతే కాకుండా పిల్లలిద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమన్నది కూడా చెప్పేశాడు.
అర్హ కంటే అయాన్ ఎక్కువగా ఇష్టమని కానీ బయట మాత్రం అందరూ అర్హ అంటేనే ఇష్టమని అనుకుంటారని చెప్పుకొచ్చాడు. ఫోటోలు అంటే అర్హకు ఇష్టమని, అయాన్ దూరంగా ఉంటాడని బన్నీ చెప్పుకొచ్చాడు. దాన్ని నిజం చేస్తూ తాజాగా స్నేహా రెడ్డి ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో బన్నీ ఒళ్లోఅర్హ పడుకుని ఉంది. అయాన్ పక్కన ఉన్నాడు. ఈ ఫోటోను స్నేహా రెడ్డి షేర్ చేస్తూ మిస్ యూ అంటూ భర్తను తలుచుకుంది.