ప్రియుడిపై పడుకుని హీరోయిన్ రొమాన్స్.. బహిరంగ ప్రదేశంలోనే ముద్దులాటలు.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నాలుగు గోడల మధ్యలో చేసుకునేవి కూడా బహీర్గతం అయిపోతున్నాయి. చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఈ తరహా పనులు చేస్తూ హాట్ టాపిక్ అవుతోన్నారు. ఈ జాబితాలో ఉన్న వారిలో ఎక్కువ మంది నటీమణులే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్మెంట్లు తదితర విషయాలతో వాళ్లు కూడా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎవడు' హీరోయిన్ తన ప్రియుడితో రొమాన్స్ చేసి ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

రామ్ చరణ్కు జోడీగా పరిచయం అయింది
వేరే దేశానికి చెందిన అమ్మాయే అయినప్పటికీ.. సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇండియా వచ్చింది హాట్ బ్యూటీ అమీ జాక్సన్. తమిళ చిత్రం ‘మద్రాసీ పట్టణం' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు... ఆ తర్వాత నేరుగా బాలీవుడ్ ఆఫర్లను పట్టేసింది. ఇక, తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు'లో మెరిసింది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు.

గ్లామర్ పాత్రలే కాదు.. టాలెంట్ చూపించింది
విదేశీ వనిత కావడంతో అమీ జాక్సన్ గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, మొదటి నుంచీ ఆమెకు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే వచ్చాయి. దీంతో చేసిన తక్కువ సినిమాల్లోనే అద్భుతమైన నటనను కనబరిచి మంచి పేరు సంపాదించుకుంది. దీంతో అన్ని భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లిపోయింది.

ఆ నటుడితో ఎఫైర్.. పెళ్లి కాకుండాను తల్లైంది
వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న సమయంలో అమీ జాక్సన్... బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం సాగించింది. చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారీ ఇద్దరు. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. దీంతో ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక, ఇటీవల అమీ.. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

గర్భవతిగా ఉన్నా ఏమాత్రం వెనకాడలేదు
నటిగా ఫుల్ బిజీగా ఉన్న అమీ జాక్సన్.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అదే సమయంలో తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గర్భవతిగా ఉన్న ఫొటోలతో రచ్చ రచ్చ చేసిందీ ఫారెన్ బ్యూటీ.
Recommended Video

ప్రియుడిపై పడుకుని హీరోయిన్ రొమాన్స్
చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న అమీ జాక్సన్.. జార్జ్ పనాయొటో ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ వివాహం చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ఆమె మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమీ.. ప్రియుడితో రొమాన్స్ చేసి షాకిచ్చింది.
బహిరంగ ప్రదేశంలోనే ముద్దులాటలు.!
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అమీ జాక్సన్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు హాట్ టాపిక్ అవుతోన్నాయి. దీనికి కారణం.. వాటిలో జార్జ్ పనాయొటోతో ఆమె బహిరంగ ప్రదేశంలో రొమాన్స్ చేస్తుండడమే. బిడ్డకు తల్లైన అమీ... తన ప్రియుడిపై పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు, తమదైన శైలిలో వాటికి కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











