Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంకెన్ని జరిగితే బుద్ది వస్తుంది.. ఆ ఘటనపై అనసూయ ఆవేదన
ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఆ ప్రకోపంలో ఎంతటి విధ్వంసం కలుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రకృతి విపత్తులు వచ్చాక వాటిపై రియాక్ట్ అవ్వడం కంటే.. వాటిని రాకుండా నివారించే పద్దతులను అవలంభించాలని అందరూ చెబుతుంటారు. వరదలు, భూకంపాలు, మంచు చరియలు విరిగిపడటం వంటివన్నీ కూడా ప్రకృతి ప్రమాదాలే. మనం ప్రకృతిని విచ్చల విడిగా వాడటం, వాటిని నాశనం చేస్తుండటంతో ఊహకందని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో జరిగింది కూడా అదే.
భారీ వరద..
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఈ క్రమంలో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ఆ ప్రవాహాంలో తపోవన్-రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్నరిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ పని చేస్తున్న 170 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికీ ఎంత మంది మరణించారు.. ఎంత మంది కనిపించకుండాపోయారన్న లెక్కలు బయటకు రాలేదు.
దేశం మొత్తం..
ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఉత్తరాఖండ్ వైపు చూస్తోంది. మంచు చరియలు విరిగిపడటం, ధౌలి గంగా, అలకనంద నదులు ఉప్పొంగడం, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోవడం, ప్రాణ, ఆస్తి నష్టం జరగుతుండటంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.
సెలెబ్రిటీల రియాక్షన్..
ఇలాంటి విపత్తులు, ప్రకృతి కోపానికి ప్రతిచర్యగా జరిగే సంఘటనలపై సెలెబ్రిటీలు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఉత్తరాఖండ్లో జరిగిన విధ్వంసంపైనా స్పందించారు. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్స్ అందరూస్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలుకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
అనసూయ ఫైర్..
అయితే అనసూయ మాత్రం కాస్త గట్టిగానే స్పందించింది. మరో విపత్తు మనల్ని కొట్టేసింది.. ప్రకృతిని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ సహజీవనం చేయాల్సిన సమయం ఇది కాదా?.. మనం గుణపాఠం నేర్చుకోవాలంటే.. ఇంకెన్ని విపత్తులు సంభవించాలి?.. ఉత్తరాఖండ్ ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని అనసూయ ఆవేదన చెందింది.