Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
త్రిషతో సూపర్ స్టార్, మధ్యలో త్రివిక్రమ్.. 15 ఏళ్ల తరువాత బయటపడిన పాత జ్ఞాపకం!
త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం అతడు. మహేష్ బాబు కెరీర్ లోనే ఆ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 2005లో వచ్చింది. 15 ఏళ్లయినా ఇప్పటికి టీవీలలో లేటెస్ట్ సినిమాల స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుంది. అతడు సినిమా గనక ఈ జనరేషన్ లో రిలీజ్ అయ్యి ఉంటే బాక్సాఫీస్ రికార్డులు ఎవరు ఊహించని విదంగా ఉండేవని చెప్పవచ్చు.
అయితే చాలా కాలం తరువాత సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక స్పెషల్ వర్కింగ్ స్టిల్ బయటపడింది. సోషల్ మీడియాలో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక వైపు మహేష్ ఉండగా మరోవైపు త్రిష మొబైల్ ఫోన్ చూస్తోంది. ఇక వారి మధ్యలో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో ముచ్చటిస్తున్నాడు. చాలా కాలం తరువాత ఆడియెన్స్ చూడని ఫోటో కనిపించడంతో అభిమానుకు ఈ ఫోటోని తెగ షేర్ చేసుకుంటున్నారు.
అతడు సినిమా మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని త్రివిక్రమ్ చాలా ట్రై చేశాడట. కానీ ఆయన ఒప్పుకోక పోవడంతో కథ మహేష్ దగ్గరకు వెళ్లింది. సినిమాలో మహేష్ సరికొత్త నటన అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. ఇక త్రిష అల్లరి తనం బ్రహ్మానందం కామెడీ కూడా బాగా వ్వర్కౌట్ అయ్యింది. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.