Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సంక్రాంతి స్పెషల్.. సుహాసిని-భానుచందర్లతో భారీ ప్లాన్
పండుగలు వస్తున్నాయంటే స్పెషల్ ఈవెంట్లు, స్పెషల్ సాంగ్లు క్రియేట్ చేయడమే ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్. అందులో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ తమ యూట్యూబ్ చానెల్స్లో ప్రతీ పండుగకు ఓ స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నారు. వాటికి కూడా ఈ మధ్య భారీ బడ్జెట్ను కేటాయిస్తు పెద్ద పెద్ద సెలెబ్రిటీలను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా దసరా పండుగకు తెలంగాణ పాటలు ఎంతగా మార్మోగుతుంటాయో అందరికీ తెలిసిందే.
అయితే ఈ సంక్రాతికి కూడా అలా పాటలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే అన్ని పాటల్లోకెల్లా ఓ పాట మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాటి సూపర్ హిట్ జంట భాను చందర్ సుహాసినిలను మళ్లీ ఇలా సంక్రాంతి పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొత్తానికి ఈ పాట బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. మామూలుగా ఇలాంటి స్పెషల్ పాటలను కాసర్ల శ్యామ్ రాస్తుంటారు. భాను చందర్ సుహాసిన నటించిన ఈ పాటను కూడా ఆయనే రచించగా భోలో షావలి, అంజనా సౌమ్య వంటి వారు ఆలపించారు.
అయితే ఈ పాటను మాత్రం క్రేజీ అంకుల్ యూనిట్తో రిలీజ్ చేయించారు. ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన సింగర్ మనో, శ్రీముఖి, రాజా రవీంద్ర చేతుల మీదగా ఈ పాటను ఆవిష్కరించారు.శ్రేయాస్ మీడియా యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ పాట విడదలై ,నెటిజెన్స్ను కట్టిపడేస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి మాత్రం పాటల సందడి ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది.