Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
2020లో ఓ ఇంటి వాళ్లైన బిగ్ బాస్ కంటెస్టెంట్లు: షోకు ముందే అవినాష్.. ఇప్పుడు శ్రీముఖి కూడా!
బిగ్ బాస్.. మన ప్రేక్షకులకు వారికి అస్సలు పరిచయం అవసరం లేని రియాలిటీ షో. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ప్రసారమవుతూ అన్ని చోట్లా అద్భుతమైన ఫలితాలను రాబడుతోందీ షో. మన భాషలో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ రియాలిటీ షోలో వల్ల ఎంతో మంది చోటా మోటా ఆర్టిస్టులు స్టార్లుగా ఎదిగిపోయారు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్తో వారిలోని కొందరు 2020లో ఓ ఇంటి వాళ్లు అయ్యారు. మరికొందరు కాబోతున్నారు. ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!
మిస్టర్ బిగ్ బాస్.. పోస్ట్ చేసి చెప్పాడు
సీరియళ్ల ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యాడు యంగ్ టాలెంటెడ్ అలీ రేజా. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. ఫినాలే వరకు వెళ్లిన అతడు.. షో తర్వాత సొంతంగా ఓ ఇంటిని కొన్నాడు. ఈ ఏడాదే గృహప్రవేశం చేశాడు.
పాతాళగంగ కూడా ఈ ఏడాదే చేసింది
న్యూస్ రీడర్గా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ను దక్కించుకుంది శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క. ఈ క్రేజ్తోనే మూడో సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన ఆమె.. తరచూ ఏడుస్తూ పాతాళగంగగా పేరు తెచ్చుకుంది. ఇక, బిగ్ బాస్ షో ద్వారా తన సొంతింటి కలను నిజం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన గృహప్రవేశానికి ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు.
దాని కోసమే బిగ్ బాస్లోకి అవినాష్
ఇటీవల ముగిసిన నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ కమెడియన్ అవినాష్. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన అతడు.. ఆ వెంటనే గృహప్రవేశం చేశాడు. దీనికి బ్రహ్మానందం, రోజా, నాగబాబు సహా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దీని వల్ల అయిన అప్పులను తీర్చుకునేందుకే అతడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
శ్రీముఖి కూడా వాళ్ల బాటలోనే వెళ్లింది
యాంకర్గా కెరీర్ను ఆరంభించి, పలు సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఆమె.. రన్నరప్గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆమె.. నిజామాబాద్లో కొత్తగా కట్టిన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ ఏడాది ముహూర్తాలు లేకపోవడంతో ఇల్లు పూర్తవక ముందే ప్రవేశించింది.
బిగ్ బాస్ ప్రామిస్తో ఈ సీజన్ నుంచి
‘మై విలేజ్ షో' ద్వారా తెలుగు వారికి సుపరిచితురాలు అయిపోయారు సహజ నటి గంగవ్వ. చాలా రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోన్న ఆమె.. బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బుతో స్వగ్రామంలో ఓ ఇంటిని నిర్మించుకుంటున్నారు. దీనికి బిగ్ బాస్ యూనిట్ కూడా ఆర్థికంగా సహయం చేసిన సంగతి విధితమే.