Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2020లో భారీ హైప్ క్రియేట్ చేసి దెబ్బ కొట్టిన ఆ మూడు సినిమాలు.. నిర్మాతలు మాత్రం సేఫ్
2020 సినిమా ఇండస్ట్రీని నెవర్ బిఫోర్ అనేలా దెబ్బ కొట్టింది. గతంలో ఎప్పుడు లేనంతగా సినిమా థియేటర్లకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక కొన్ని ప్రముఖ థియేటర్స్ అయితే మొత్తనికే క్లోజ్ అయ్యాయి. భవిష్యత్తులో థియేటర్స్ ఉనికిని కోల్పోతాయా అనేంతగా కరోనా లాక్ డౌన్ ఒక కొత్త అనుమానాన్ని క్రియేట్ చేసింది. ఇక కొందరు నిర్మాతలు సేఫ్ జోన్ లో ఓటీటీని ఆసరాగా చేసుకొని బ్రతికిపోయారనే చెప్పాలి. అయితే ఈ ఏడాది ఎంతగానో విజయం సాధిస్తాయాని అనుకున్న మూడు సినిమాలు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి. ఆ మూడు సినిమాలు కూడా ఆమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కావడం విశేషం.
ఆ విధంగా అలవాటు పడిన జనాలు
ఓవర్ ద టాప్ సంస్థలకు ఇప్పుడు జనాలు బాగానే అలవాటు పడ్డారు. మంచి సినిమాల రైట్స్ అందుకునే సంస్థలకు ఆడియెన్స్ ఎక్కువగా పెరుగుతున్నారు. ఏడాది వరకు సబ్ స్క్రిప్షన్ తో హ్యాపీగా సినిమాలు చూసుకోవచ్చని ఓటీటీ కంపెనీలకు మద్దతు ఇస్తున్నారు. థియేటర్స్ ముత పడడంతో లాక్ డౌన్ కంటే ముందు షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలు చాలా వరకు ఓటీటీలోనే విడుదలయ్యాయి.
మొదట్లోనే పెంగ్విన్ దెబ్బ
అయితే అందులో ఎంతగానో నమ్మకం పెట్టుకున్న మూడు పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అందులో మొదటిది కీర్తి సురేష్ పెంగ్విన్. మహానటి తరువాత అంతగా ఎట్రాక్ట్ చేయని కీర్తి ఆ సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. లాక్ డౌన్ కాలంలో ఓటీటీ ద్వారా విడుదలైన మొదటి పెద్ద సినిమా ఇదే. ఆమెజాన్ ప్రైమ్ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేసింది. కానీ సినిమా ఏ భాషలో కూడా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
V కూడా దెబ్బేసింది
ఇక మరో సినిమా V పై కూడా అంచనాలు ఏ రేంజ్ లో పెరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కావడం, అలాగే టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను నిర్మించడం, ముఖ్యంగా సుధీర్ బాబు మరో హీరోగా కనిపించడం.. ఇలా అన్ని అంశాలు సినిమా మార్కెట్ కు బూస్ట్ ఇచ్చాయి. ఇక చాలా రోజులు వెయిట్ చేసి ప్రైమ్ లో విడుదల చేయగా నెగిటివ్ టాక్ ను అందుకుంది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఆ సినిమా డిజాస్టర్ అయ్యి ఉండేదని కామెంట్స్ వచ్చాయి.
అనుష్క నిశ్శబ్దం కూడా..
ఇక భారీ అంచనాలతో వచ్చిన మరో సినిమా నిశ్శబ్దం. బాహుబలి, భాగమతి తరువాత మళ్ళీ ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించని అనుష్క రెండేళ్ల తరువాత విడుదల చేసిన సినిమా నిశ్శబ్దం. ఆ సినిమా హిట్ అవుతుందని విడుదలకు ముందు చాలా నమ్మకం పెట్టుకున్న ఆడియెన్స్ ను విడుదల తరువాత నిరాశపరిచింది. కానీ నిర్మాత ఓటీటీ రైట్స్ ద్వారా సేఫ్ అయినట్లు తెలిసింది. ఏదేమైనా ఆమెజాన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు గట్టిగానే దెబ్బేశాయి.