Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
గురు శిష్యుల బంధమంటే ఇదే.. కళాతపస్వికి పాదాభివందనం చేసిన చిరంజీవి
ఎంతటి మెగాస్టార్ అయినా అమ్మకు కొడుకే.. గురువుకు శిష్యుడే. మెగాస్టార్ చిరంజీవి తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదుటివారిని గౌరవించడంలో, మర్యాద ఇవ్వడంలో ముందుంటాడు. మరీ ముఖ్యంగా తనకు గురువైన కళాతపస్వీ కే విశ్వనాథ్ను గౌరవించుకోవడంలో ముందుంటాడు. అక్కడ ఎలాంటి ప్రోటోకాల్ను ఉపయోగించుకోడు. ఆ మధ్య కళాతపస్వీకి సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం లభించిన సందర్భంలో కలిశాడు.
ఆప్యాయంగా పలకరించాడు..
కళాతపస్వికి దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఆ సందర్భంగా గురువును ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. ఫోన్లో ఎవరితోనే కే విశ్వనాథ్ మాట్లాడుతూ ఉంటే అంత సేపు ఎదురుచూశాడు. గురును డిస్టర్బ్ చేయొద్దని ఆ తరువాతే పలకరించాడు. మళ్లీ తాజాగా దీపావళి పర్వదినాన సతీసమేతం చిరంజీవి కళాతపస్వీ ఇంటికి వెళ్లారు.
దీపావళి సందర్భంగా..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి సతీసమేతంగా విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. చిరంజీవి పాదాభివందనం చేస్తూ గురువు వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. సంప్రదాయబద్దంగా విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టారు.
కలవాలనిపించింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారిని కలవాలనిపించింది. అందుకే ఈ రోజు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. దీపావళి వేళ ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చాడు.
Recommended Video
చిరంజీవిలో నటనను..
చిరంజీవిలో నటుడిని తెలుగు ప్రేక్షక లోకానికి విశ్వనాథ్ పరిచయం చేశారు. స్వయంకృషి, ఆపద్భాంధవుడు సినిమాలతో చిరంజీవి మరో మెట్టు ఎక్కించారు. ఈ రెండు చిత్రాలకూ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు చిరంజీవి. తన ఇమేజ్ను పక్కనపెట్టి విశ్వనాథ్ బాటలో నడిచాడు.