Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడేళ్ల ‘మహానుభావుడు’.. డైరెక్టర్ మారుతి ట్వీట్ వైరల్
భలె భలె మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం మహానుభావుడు. అయితే భలె భలె మగాడివోయ్ చిత్రంలో ఉన్నట్టు హీరోకు ఓ లోపాన్ని పెట్టారు. మతిమరుపు పాత్రలో నాని అదరగొట్టడంతో భలె భలె మగాడివోయ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. అదే ఫార్మాట్లో వచ్చింది మహానుభావుడు. అయితే ఇందులో శర్వానంద్కు ఓసీడీ అంటూ అతి శుభ్రతతో బాధపడే పాత్రలో నటించాడు.
మహానుభావుడు అంటూ శర్వానంద్ అద్భుతంగా నటించాడు. అయితే మహానుభావుడు మాత్రం భలె భలె మగాడివోయ్ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ కరోనా వైరస్ సంక్రమించిన సమయంలో ఈ చిత్రం తెగ వైరల్ అయింది. చేతికి శానిటైజర్, దూరం పాటించడం, శుభ్రంగా ఉండటం, మాస్కులు ధరించడం వంటివి ఈ సినిమాలో ముందే చూపించాడు. మారుతి ముందే ఊహించి ఈ చిత్రం తీశాడా? అంటూ పొగిడేశారు నెటిజన్లు.
మహానుభావుడు చిత్రానికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా మారుతి ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు మారుతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం నా సినీ కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. మీ అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నా.. అందరూ మాస్కులను ధరించండి.. భౌతిక దూరాన్ని పాటించండి.. ఇదే విషయాన్ని నాడు మీకు ఈ సినిమా ద్వారా చూపించాను అని చెప్పుకొచ్చాడు.