Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మూడేళ్ల ‘మహానుభావుడు’.. డైరెక్టర్ మారుతి ట్వీట్ వైరల్
భలె భలె మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం మహానుభావుడు. అయితే భలె భలె మగాడివోయ్ చిత్రంలో ఉన్నట్టు హీరోకు ఓ లోపాన్ని పెట్టారు. మతిమరుపు పాత్రలో నాని అదరగొట్టడంతో భలె భలె మగాడివోయ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. అదే ఫార్మాట్లో వచ్చింది మహానుభావుడు. అయితే ఇందులో శర్వానంద్కు ఓసీడీ అంటూ అతి శుభ్రతతో బాధపడే పాత్రలో నటించాడు.
మహానుభావుడు అంటూ శర్వానంద్ అద్భుతంగా నటించాడు. అయితే మహానుభావుడు మాత్రం భలె భలె మగాడివోయ్ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ కరోనా వైరస్ సంక్రమించిన సమయంలో ఈ చిత్రం తెగ వైరల్ అయింది. చేతికి శానిటైజర్, దూరం పాటించడం, శుభ్రంగా ఉండటం, మాస్కులు ధరించడం వంటివి ఈ సినిమాలో ముందే చూపించాడు. మారుతి ముందే ఊహించి ఈ చిత్రం తీశాడా? అంటూ పొగిడేశారు నెటిజన్లు.
మహానుభావుడు చిత్రానికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా మారుతి ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు మారుతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం నా సినీ కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. మీ అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నా.. అందరూ మాస్కులను ధరించండి.. భౌతిక దూరాన్ని పాటించండి.. ఇదే విషయాన్ని నాడు మీకు ఈ సినిమా ద్వారా చూపించాను అని చెప్పుకొచ్చాడు.