Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీకు ఇక్కడ చోటు లేదు...వాళ్లను గెంటివేసిన యాంకర్ అనసూయ!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యాంకర్ అనసూయ... అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశంసలు స్వీకరించడం మాత్రమే కాదు, విమర్శలను కూడా అదే స్థాయిలో ధైర్యంగా తిప్పికొడుతుంది. తన పోస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారికి తనదైన శైలిలో బుద్ది చెప్పడం ఆమె ప్రత్యేకత.
సంకుచిత మనస్తత్వం గల కొందరు నెటిజన్లు తరచూ అనసూయ ఫోటోలపై, ఆమె చేసే ట్వీట్లపై, వ్యక్త పరిచే అభిప్రాయాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతుండటం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. ఇలాంటి వారిని ఉద్దేశించి అనసూయ తాజాగా ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.
పని లేకుండా తిరిగే వారికంటే మేమ చాలా బెటర్
మేము నటులం కావడం వల్ల, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కావడం వల్ల... మాకు మా వ్యక్తిగా అభిప్రాయాలు చెప్పే హక్కులేనట్లుగా కొందరు భావిస్తున్నారు. అలాంటి వారు తమ ఆలోచనా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పని లేకుండా ఖాళీగా తిరిగే వాళ్లకంటే మేము చాలా చాలా బెటర్.... అని అనసూయ వ్యాఖ్యానించారు.
సినిమాలోని అంశాలను నిజ జీవితానికి ఆపాదించ వద్దు
సినిమాలో మేము రకరకాల పాత్రలు చేస్తాం, రకరకాల వేషధారణలో కనిపిస్తాము. అయితే మేము సినిమాలో ప్రవర్తించినట్లుగా, అక్కడ కనిపించినట్లు.... నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాము అనుకోవడం పొరపాటే. మా సినిమా జీవితానికి, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి... అని అనసూయ తెలిపారు.
|
నీచులను నిర్దయగా గెంటివేసిన యాంకర్ అనసూయ!
అనసూయ ఎంత చెప్పిన వినయకుండా కొందరు వితండ వాదం చేస్తూ నీచమైన కామెంట్లతో రెచ్చిపోయారు. దీంతో అనసూయ అందరినీ తన పేజీ నుంచి గెంటివేసింది. ‘వితండ వాదానికి నా అకౌంట్ పేజీలో చోటు లేదు. అందరినీ బ్లాక్ చేస్తున్నాను. ఇది నా అకౌంట్.. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏదైనా చేసే హక్కు నాకు ఉంది' అని అనసూయ వ్యాఖ్యానించారు.
అనూయ భరద్వాజ్
అనసూయ భరద్వాజ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు'లో కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యాంకర్గా, సినిమా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చలాకీ యాంకర్ త్వరలో నిర్మాతగా మారి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసేందుకు సిద్దమవుతోంది.