Janardhana Maharshi రచనలకు అనూహ్యమైన స్పందన.. ఈగ రైటర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా జనార్ధన మహర్షి ప్రేక్షకులు, పాఠకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేస్తూనే పుస్తక రచనలపై దృష్టిపెట్టారు.
2003లో వెన్నముద్దలు పుస్తకంతో రచయితగా పేరు సంపాదించుకొన్న ఆయన చిదంబర రహస్యం పుస్తకంతో మరింత పాపులారిటిని సంపాదించుకొన్నారు. వెన్న ముద్దలు 12 ముద్రణల ప్రచురణకు నోచుకొన్నది. ఆ తర్వాత పంచామృతాలు కథా సంకలనం మరింత పాపులారిటిని సంపాదించింది. 2007లో ఆయన రాసిన గర్బగుడి పుస్తకం కళాతపస్వి విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన దేవస్థానంకు స్పూర్తిగా నిలిచింది.

పలు పుస్తకాలు అందించిన ప్రోత్సాహం, పాపులారిటితో జనార్ధన మహర్షి రచనా ప్రస్థానం కొనసాగింది. మధుర సంభాషణలు సంకలనం పాఠకులకు మంచి అనుభూతిని పంచిపెట్టింది. 2019లో వచ్చిన మరో కథా సంకలనం చిదంబర రహస్యం ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. 2021లో స్మశాన వైరాగ్యం, 2022లో వచ్చిన జనపదాలు ఆయన రచనా ప్రతిభకు, పరిణతికి అద్దం పట్టాయి. రానున్న రోజుల్లో సమాజానికి కొత్త ఆలోచనలు రేకెత్తించే రచనలు అందించాలని పాఠకులు కోరుకొంటున్నారు.
జనార్ధన మహర్షి కెరీర్ విషయానికి వస్తే.. సినీ రచయితగా వెంకీ మామ, హంగామా, ఈగ, మా నాన్నకు పెళ్లి, కన్యాదానం, చాలా బాగుంది, మావిడాకులు, జై బోలో తెలంగాణ, ఎవడి గోల వాడిది, పేకాట పాపారావు లాంటి సినిమాలు అందించారు. దేవస్థానం అనే సినిమాకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











