Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జయప్రకాష్ రెడ్డి మృతి.. కరోనాతో తనయుడు అంత్యక్రియలకు దూరం!
టాలీవుడ్ విలక్షణ నటులు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో నేటి (సెప్టెంబర్ 8) ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెండితెరపై ఎన్నో భిన్న పాత్రలు ధరించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన అకాల మృతిపై తెలుగు సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ జయ ప్రకాష్ మృతి పట్ల ఆందోళన చెందుతున్నారు.
గొప్ప నటులు, నాటక రంగాన్ని అమితంగా ప్రేమించేవారు అంటూ జయప్రకాష్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రవితేజ, సాయి ధరమ్ తేజ్, రామ్, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాష్ రా, వెంకటేష్, కోన వెంకట్, గోపీ మోహన్, వివి వినాయక్, నాగబాబు, పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ జయప్రకాష్ రెడ్డిని తలుచుకున్నారు.
అయితే జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలకు మాత్రం ఆయన కుమారుడు హాజరు కాలేకపోతున్నాడట. వారి కుటుంబానికి కరోనా సోకడంలో అందరూ చికిత్స తీసుకుంటున్నారట. జయ ప్రకాష్ రెడ్డి కూడా పరీక్షలు చేయించుకుంటే ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందట. కానీ కొడుకు, కోడలికి మాత్రం పాజిటివ్ వచ్చిందట. వారు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించబోతోన్నారని తెలుస్తోంది.