Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మెగా’ వేడుకగా నిహారిక ఎంగేజ్మెంట్.. చిరంజీవి ఆశీస్సులతో.. పవన్ రాకపై..
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. కుటుంబ కార్యక్రమంగా జరిగిన వేడుకకు అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ నిశ్చితార్థం గురించి వివరాల్లోకి వెళితే..,
నిహారికతో చైతన్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్
నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడం, ఆ తర్వాత వారు అంగీకరించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో తన ప్రియుడిని కాబోయే భర్తగా చైతన్యను తమ అభిమానులకు, నెటిజన్లకు పరిచయం చేశారు.
కుటుంబ కార్యక్రమంగా ఎంగేజ్మెంట్
ఇక లాక్డౌన్ పిరియడ్లో నిహారిక, చైతన్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగినప్పటికీ నిశ్చితార్థం, పెళ్లికి కరోనా పరిస్థితులు అడ్డొచ్చాయి. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడితే ఎంగేజ్మెంట్ను గ్రాండ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిశ్చితార్థం వేడుకు కుటుంబ కార్యక్రమంగా చేయాలని నిర్ణయించారు.
ప్రైవేట్ హోటల్లో నిరాడంబరంగా
నిహారిక, చైతన్య వివాహా నిశ్చితార్థానికి వేదిక హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి పెద్దగా వ్యవహరించిన చిరంజీవి నిరాడంబరంగా వేడుకను తన చేతుల మీదుగా జరిపించారు. నిశ్చితార్థం కార్యక్రమం అనంతరం చిరంజీవి, సురేఖ దంపతులు కాబోయే నవ దంపతులుకు ఆశీస్సులు, దీవెనులు అందించారు.
రాంచరణ్, అల్లు అర్జున్ హాజరు
నిహారిక, చైతన్య పెళ్లి నిశ్చితార్థానికి రాంచరణ్ దంపతులు హాజరయ్యారు. ఇంకా మెగా కుటుంబంలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ దేవ్; వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. అయితే పవన్ కల్యాణ్ వచ్చారా అనే విషయంపై క్లారిటీ లభించలేదు.