Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ నిర్ణయంతో హృదయం బద్దలైంది.. రజనీకాంత్పై కుష్బూ ఎమోషనల్ కామెంట్స్
రజనీకాంత్ రాజకీయాల్లోంచి తప్పుకోవడంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు సరైన నిర్ణయం తీసుకున్నారని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఎంతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజనీకాంత్ నిర్ణయాలు, ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. డిసెంబర్ 31 పార్టీ ప్రకటన ఉంటుందని, కొత్త ఏడాదిలో కొత్త పార్టీ ప్రకటిస్తాడని అభిమానులు ఎదురుచూశారు. కానీ తాజాగా పరిస్థితి మొత్తం తారుమారైంది.
వారం రోజుల విశ్రాంతి..
అన్నాత్తె షూటింగ్లో కరోనా కలకలం సృష్టించడం, రజనీకి నెగెటివ్ రావడం అందరికీ తెలిసిందే. అయితే రక్త పోటు సమస్యలతో రజనీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. గతంలో కిడ్నీ మార్చడంతో రజనీకి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వారం రోజులుగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. కరోనా సోకే అవకాశం ఉన్న పరిస్థితులకు రజనీ దూరంగా ఉండాలని హెచ్చరించారు.
రజనీ ప్రకటన..
రజనీకాంత్ తాజాగా ఓ సెన్సేషనల్ ప్రకటన చేశాడు. నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అయింది.. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.. ఎంతో నష్టం వచ్చింది..అదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని రజనీకాంత్ ఎమోషనల్ అయ్యాడు.
ఆ బాధ నాకు తెలుసు..
నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు.. కానీ నా వల్ల మిగతా వారంతా సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు.. రాజకీయాల్లోకి రావడం లేదు..ఈ ప్రెస్ నోట్ రాసేప్పుడు కలిగిన బాధ నాకు మాత్రమే తెలుసంటూ రజనీ అందరినీ కదిలించాడు.
హృదయం బద్దలైంది..
రజనీకాంత్ నిర్ణయంపై కుష్బూ ఎమోషనల్ అయింది. డియర్ రజనీ సర్.. మీ నిర్ణయం ఎంతో మంది తమిళుల హృదయాన్ని బద్దలుకొట్టేసింది. కానీ నాకు సమస్య పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు.. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా ఉండండి.. సంతోషంగా ఉండండని కుష్బూ ట్వీట్ చేసింది.