Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలా ఎలా జరిగింది.. కత్తితో కంటికి గాయం.. కుష్బూ ఫోటో వైరల్
తమిళ, తెలుగు భాషల్లో ఒకప్పుడు ఎంతో ఫేమస్ అయిన హీరోయిన్ కుష్బూ.. సెకండ్ ఇన్నింగ్స్లో దుమ్ములేపింది. స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి వంటి చిత్రాలతో మెప్పించింది. కాంగ్రెస్ నాయకురాలైన కుష్బూ.. సినీ, రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ కాలంలో కుష్బూ చేసిన ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య షూటింగ్లు తిరిగి ప్రారంభం కావడంతో కుష్బూ మీడియాపై ఆడిపోసుకుంటూ మాట్లాడిని ఆడియో లీకై ఎంతటి వివాదాన్ని రేపిందో అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్..
కుష్బూ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఇక రాజకీయంగా చేసే కామెంట్లు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తాయి. ఇక నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అంతే గట్టిగా సమాధానిమిస్తూ.. సాయం అడిగిన వారికి చేతనైనంతా చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కుష్బూకు బెదిరింపులు ఎదురవడం ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే.
అయోధ్య రామమందిరం..
అయోధ్యలో రామమందిరం భూమి పూజ కార్యక్రమం రోజు కుష్బూ చేసిన కామెంట్లకు ఆమెపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. హత్యచేస్తామని బెదిరించడంతో ఆ ఫోన్ నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతడిని హెచ్చరించింది.పైగా ఆ నంబర్ పశ్చిమ బెంగాల్ది అని తెలుసుకుని సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు కూడా చేసింది.
ఫిట్నెస్ క్లాసులు..
నిత్యం వివాదాలే కాకుండా.. సోషల్ మీడియాలో ఫిట్నెస్ పాఠాలు కూడా చెబుతూ ఉంటుంది. జీరో సైజ్కు ఎలా మారాలో, తాను ఎలా మెయింటైన్ చేస్తుందో కూడా వివరిస్తూ ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామం, ఇంటి పనులు చేస్తూ ఈ లాక్ డౌన్లో జీరో సైజ్లోకి మారానని కుష్బూ చెప్పుకొచ్చింది.
కత్తితో కంటికి గాయం..
కుష్బూ తాజాగా ఓ ట్వీట్ చేసింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. ‘హాయ్.. ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విటర్కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి' అని చెప్పుకొచ్చింది. అలా ఎలా తగిలింది? ఏమైందని అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.