Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కాజల్ చీప్గా బిహేవ్ చెయ్యొద్దు.. లక్ష్మి మంచు వార్నింగ్
లాక్డౌన్ తర్వాత యాక్టర్, హోస్ట్ మంచు లక్ష్మి మళ్లీ బిజీగా మారుతున్నారు. తాజాగా లక్ష్మి మంచు షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 15న రానా దగ్గుబాటి యూట్యూబ్ ఛానెల్ సౌత్ బేలో ఈ షో ప్రీమియర్ అయింది. తొలి షోలో తాప్సీ పన్ను, సెంథిల్ రాంమూర్తి, ఎస్ఎస్ రాజమౌళి, ఫ్రాంక్ కొరాకి పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మి మంచు మీడియాతో మాట్లాడుతూ...
రాజమౌళి, తాప్సీ పన్నుతో
సెంథిల్, ఫ్రాంక్, రాజమౌళి, తాప్సీతో నాకు మంచి అనుబంధం ఉంది. సెంథిల్తో కలిసి పనిచేశాను. తాప్సీ నా తమ్ముడితో కలిసి నటించింది. ఆ సినిమాకు నేనే నిర్మాత. కాబట్టి తాప్సీ తో మంచి అనుబంధం పెరిగింది. వారందర్ని ఒక చోట చేర్చడం పెద్ద కష్టం కాలేదు అని లక్ష్మీ మంచు చెప్పారు.
నా ఫార్మాట్కు మంచి క్రేజ్2
సరికొత్తగా కాన్సెప్ట్తో షోను ప్లాన్ చేసినప్పుడు నేను నాకు క్లోజ్గా ఉండే వారిని సంప్రదించాను. అందుబాటులో ఉన్న వారందరితో మాట్లాడాను. నా ఫార్మాట్ను బాగా అర్థం చేసుకొన్నారు. నా ప్రతిపాదనకు త్వరగా స్పందించారు. దాంతో నా షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని లక్ష్మి మంచు తెలిపారు.
త్వరలో అమితాబ్, అమీర్ ఖాన్తో
త్వరలోనే నా షోలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, జానీ డెప్, ఓప్రా విన్ ఫ్రే లాంటి ప్రముఖులతోపాటు మరికొంది స్టార్ హీరోలను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నా షో కోసం మరింత ప్రేక్షకాదరణను కూడగట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అని లక్ష్మి మంచు తెలిపారు.
ఆ విషయంలో రానా సిగ్గుపడడు..
సౌత్ ఇండియాలో చాలా మంది యాక్టర్లు షోలో పాల్గొనడానికి, ఏదైనా విషయాన్ని పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు. కానీ రానా ఒక్కడే ఎలాంటి ఆలోచన, బిడియం లేకుండా కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటాడు. చాలా ఓపెన్గా, నిజాయితీగా ఉంటాడు. చాలా కొద్ది మందే అలా ఉంటారు అని లక్ష్మి మంచు పేర్కొన్నారు.
Recommended Video
పెళ్లి తర్వాత అలా బిహేవ్ చేయకు...
నా బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం హ్యాపీగా ఉంది. పెళ్లికి ముందు చాలా విషయాలు మాట్లాడుకొన్నాం. లాక్డౌన్లో పెళ్లి చేసుకొంటున్నావు కాబట్టి పార్టీలు కోరడం లేదు. అయితే పార్టీలు ఇవ్వకుండా తప్పించుకోవద్దు. పార్టీ విషయంలో చీప్గా బిహేవ్ చేయకు. అన్ని సర్దుకొన్నాక అందరికి మంచిగా భారీ పార్టీ అరెంజ్ చేయమని కాజల్కు సలహా ఇచ్చానని లక్ష్మీ మంచు చెప్పారు.