Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మ్యూజింగ్స్ అలా చేస్తాడట.. పూరి గుట్టు విప్పిన పాటల రచయిత
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూరి జగన్నాద్ తన మాటల తూటాలతో ఎందరిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించాడు.. ఇంకెందరిలోనో స్ఫూర్తినింపాడు. కావాల్సినంత ధైర్యాన్ని నూరిపోశాడు. కొత్త ఒరవడికి నాంది చుట్టాడు. పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్, పాడ్ కాస్ట్ ద్వారా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పూరి చెప్పిన మాటలెన్నో సెన్సేషనల్ అయ్యాయి. దేశం గురించి, స్త్రీ గురించి, మన పురాణాల గురించి ఇలా ఎన్నెన్నో విషయాల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.
చాలా మందికి తెలియని విషయాలెన్నో చెప్పాడు. అంతే కాకుండా అందరికీ తెలిసిన విషయాలను కూడా ఎంతో గొప్పగా అర్థమయ్యేలా, మార్పు తెచ్చేలా చెప్పాడు. ఫ్లాప్ సినిమాలు, దర్శక నిర్మాతల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. నెగెటివ్ రివ్యూలు, వార్తలు రాసేవారిలో ఆలోచనలు కలిగేలా.. సినిమాను బతికించాలనే కోరిక పుట్టేలా చెప్పుకొచ్చాడు. అయితే పూరి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి చెబుతున్నాడు.. ఎలా చెబుతున్నాడనే అనుమానం అందరికీ వచ్చే ఉంటుంది.
లాక్డౌన్లో పూరి ముంబైలోనే చిక్కుకున్నాడని తెలిసిందే. అయితే అక్కడి నుంచే ఈ పాడ్ కాస్ట్లను రికార్డు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పాటల రచయిత భాస్కర భట్ల ట్వీట్ చేస్తూ.. అందరిలాగే నేనూ పూరి మ్యూజింగ్స్ కి పెద్ద అభిమానిని. పూరి అన్నయ్య ఈ మ్యూజింగ్స్ ని ఎక్కడ కూర్చొని రికార్డ్ చేస్తారో తెలుసుకోవాలని ఉండేది. మొన్న ముంబై వెళ్లినప్పుడు ఆయన రికార్డ్ చేస్తుంటే ఒక ఫోటో తీశా. మీకోసం ఇక్కడ పెడుతున్నా' అని అసలు సంగతి బయటపెట్టాడు.