Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్లీ హాట్ టాపిక్ అవుతోన్న బిల్లా రంగా.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్
మెగా మంచు ఫ్యామిలీ మధ్య ఉన్న బేధాలు, బంధాలు, ప్రేమలు అన్ని అందరికీ తెలిసిందే. బయటకు మాత్రం చిరంజీవి మోహన్ బాబు మధ్య విబేధాలున్నాయని వార్తలు వస్తుంటాయి. మళ్లీ కొన్నిసార్లు వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి వార్తలు వస్తుంటాయి. వారిద్దరి సంగతి ఎలా ఉన్నాగానీ మంచు హీరోలు, మెగా హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉన్నారు. వీరంతా కలిసి ఎప్పుడూ రచ్చ చేస్తూనే ఉంటారు.
రామ చరణ్, సాయి ధరమ్, వరుణ్ తేజ్ వంటి వారంతా మంచు ఫ్యామిలీతో ఎంతో క్లోజ్గా ఉంటారు. అలాగే మంచు లక్ష్మీ, మంచు మనోజ్ మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్మి ఓపెనింగ్కు రామ్ చరణ్ అతిథిగా వచ్చి మరోసారి వారి బంధాన్ని చాటాడు. తాజాగా మంచు మనోజ్ సాయి ధరమ్ తేజ్తో ఉన్న అనుబంధం గురించి తెలిసేలా ఓ ట్వీట్ చేశాడు. తేజుకు విషెస్ చెబుతూనే పాత మాటలను గుర్తు చేశాడు.
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృశ్చికంగా అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ అయిన బిల్లా రంగా చిత్రానికి 38 ఏళ్లు అవుతున్నాయి. నాకు తెలిసి ఇది ఒక సూచన ఇస్తోంది..నేను రెడీ నువ్ రెడీయా? అంటూ ట్వీటేశాడు. దీనికి తేజూ కూడా రెడీ అన్నట్టుగానే రిప్లై ఇచ్చాడు. చిన్న తనం నుంచి వీరిద్దరూ ఈ సినిమాను రీమక్ చేయాలనే కోరికతోనే ఉన్నారట. మరి చూడాలి అలాంటి అద్భుతమైన కథ మళ్లీ దొరికి, సరైన దర్శకుడు దొరికితే విజువల్ ట్రీట్లానే ఉంటుంది.