twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవితో నటించిన టాప్ హీరోయిన్‌‌ను గుర్తుపట్టగలరా? మెరుపుతీగలా ఉండే భామ షాకింగ్‌గా ఇలానా?

    |

    బాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొన్న హీరోయిన్లలో మీనాక్షి శేషాద్రి ఒకరు. 80, 90 దశకంలో కేవలం హిందీ సినీ రంగంలోనే కాకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అభినయంతో ఆకట్టుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే వెండి తెరకు దూరమయ్యారు. ఇంతకు మీనాక్షి శేషాద్రి ఏలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలకు సమాధానం కోసం.. ఆమె వ్యక్తిగత జీవితం పరిశీలిద్దాం..

    క్లీవేజ్ షోతో సెగలు రేపుతోన్న 'ఆదిపురుష్' హీరోయిన్

    హీరో మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా

    హీరో మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా

    మీనాక్షి శేషాద్రి పెయింటర్ బాబు అనే చిత్రంతో హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత హీరో అనే చిత్రంతో అత్యంత పాపులారిటీ సాధించారు. జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందడంతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు.

    దక్షిణాదిలో అలా ఎంట్రీ

    దక్షిణాదిలో అలా ఎంట్రీ

    అనిల్ కపూర్, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ ఇండియా రీమేక్‌‌‌తో మీనాక్షి శేషాద్రి తమిళ సినీ రంగంలోకి ప్రవేశించారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన అపద్భాంధవుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అచ్చం తెలుగు అమ్మాయిలో ప్రేక్షకులను మెప్పించారు.

     చిరంజీవితో రెండోసారి

    చిరంజీవితో రెండోసారి

    ఆ తర్వాత దక్షిణాదిలో విజయవంతమైన జెంటిల్మెన్ చిత్రం హిందీ రీమేక్ ఆజ్‌ కా గుండారాజ్ చిత్రంతో మరోసారి చిరంజీవితో జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌కు మరోసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే అనూహ్యంగా కెరీర్ మంచి ఉన్నత స్థితిలో ఉండగానే.. హరీష్ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ను వివాహం చేసుకొని ప్రేక్షకుల షాకిచ్చారు.

    అమెరికాలోని టెక్సాస్‌లో

    అమెరికాలోని టెక్సాస్‌లో

    ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం. టెక్సాస్‌లో భారతీయ సంప్రదాయ నృత్యాల శిక్షకురాలిగా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా సమాజసేవ, అందుకు సంబంధించి నిధుల సేకరణ చేబడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    మెరుపు తీగలా నుంచి అలా మారిపోయి..

    మెరుపు తీగలా నుంచి అలా మారిపోయి..

    అయితే ఎంతో ముద్దుగా అందంగా ఉండే మీనాక్షి శేషాద్రి శారీరపరంగా పూర్తిగా మారిపోయారు. మెరుపు తీగలా ఉండే ఆమె ప్రేక్షకుల ఊహించుకోలేని విధంగా కనిపించడంతో ఓ రకమైన షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనాక్షి శేషాద్రి చివరిసారిగా ఘాయల్ వన్స్ అగైన్ అనే బాలీవుడ్ చిత్రంలో కనిపించారు.

    English summary
    Bollywood actress Meenakshi Seshadri latest photos goes viral. She acted with Chiranjeevi in Aapadbandhavudu, Aaj Ka Goonda Raj as Heroine Shocks audience. She is living in Texas of US and giving coaching as Indian classical dance in Texas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X