Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2020లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అతిపెద్ద షాక్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మిడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తనను తాను ఒక సరికొత్త మెగాస్టార్ అనిపించుకుంటున్నారనే చెప్పాలి. ఎన్నో మంచి విషయాలతో అభిమానులను ఉత్తేజ పరచటమే కాకుండా సామాజిక బాద్యతను కూడా అభిమానులకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడప్పుడు షాకుల మిధ షాకులు కూడా ఇచ్చేస్తున్నారు.
కొన్నిసార్లు సరదాగా నవ్విస్తున్నారు. మరికొన్ని సార్లు తనదైన శైలిలో స్వీట్ కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. అయితే 2020లో మెగస్టార్ వేసిన అన్ని ట్వీట్స్ లలో ఎక్కువగా షాక్ ఇచ్చిన ట్వీట్ మాత్రం ఆయన గుండు చేయించుకున్నట్లు చెప్పిన ట్వీట్ అనే చెప్పాలి. ఈ ఏడాది సెప్టెంబరులో మెగా అభిమానులకు ఎక్కువగా సర్ ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ అంతకుముందు ఎన్నో రకాల డిఫరెంట్ లుక్స్ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ లుక్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇచ్చింది.
మొదట నిజంగా గుండు చేయించుకున్నట్లు నమ్మించిన మెగాస్టార్ ఆ తరువాత అది లుక్ టెస్ట్ కోసం ప్రాస్థటిక్ మేకప్ అని రివీల్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయనున్న వేదళం రీమేక్ కోసం మెగస్టార్ అర్బన్ మాంక్ లుక్ ను ఆ విధంగా టెస్ట్ చేశారు. ''నా కొత్త లుక్ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. మేజిక్ ఆఫ్ సినిమాకు సెల్యూట్'' అంటూ వేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగ వైరల్ అయ్యింది.