Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిర్మాణ సంస్థపై బూతుల వర్షం.. బ్లాక్ చేసేస్తామంటూ మైత్రీ ఆగ్రహం
టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ వన్ నిర్మాణ సంస్థ, భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా సంస్థ ఏది అని ఎవరిని అడిగినా అందరూ మైత్రీ మూవీస్ పేరు చెబుతారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. స్టార్ క్యాస్టింగ్, భారీ నిర్మాణ విలువలో మైత్రి మూవీస్కు సపరేట్ బ్రాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్లు మరో నిర్మాణ సంస్థ చేతిలో లేవు.
సెట్స్ మీద..
ప్రస్తుతం మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తోన్న చిత్రాల్లో సెట్స్ మీద చాలానే ఉన్నాయి. ఇందులో పుష్ప సినిమా అన్నింటికంటే ముందుంటుంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక సర్కారు వారి పాట అంటూ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.
సెట్స్ మీదకు రానున్నచిత్రాలు..
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, చిరంజీవి బాబీ, నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, ప్రభాస్తో ఓ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు ప్లాన్ చేసేసి ఉన్నారు.
ఉప్పెనతో బ్లాక్ బస్టర్..
ఈ మధ్యే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొత్త హీరో హీరోయిన్ దర్శకుడితో భారీ స్థాయిలో తెరకెక్కించిన సినిమా నిజంగానే 'ఉప్పెన'లాంటి వసూళ్లను సాధించి పెట్టేసింది.
తాజాగా అలా..
అయితే తాజాగా మైత్రీ మూవీస్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ మధ్యే యూవీ సంస్థను ఇలానే నెటిజన్లు దారుణంగా ఏకిపారేశారు. ఇప్పుడు మైత్రీ వంతు వచ్చింది.
Recommended Video
స్వీట్ వార్నింగ్..
ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లపై మైత్రీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వారి అకౌంట్లను బ్లాక్ చేసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అందరూ చేయి చేయి కలిపి ప్రేమను పంచండి.. పాజిటివిటీని ప్రచారం చేయండని మైత్రిగా చెప్పింది. ఈ ట్వీట్ పైనా నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టేశారు.