Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగ చైతన్యతో సాయి పల్లవి గుసగుసలు.. కూల్ పోస్టర్తో కీలక అప్డేట్
ఫిదా లాంటి కూల్ హిట్తో శేఖర్ కమ్ముల మళ్లీ ఫాంలోకి వచ్చాడు.అయితే ఫిదా వచ్చి చాలా రోజులు అవుతున్నా మరో సినిమాతో శేఖర్ కమ్ములు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ తన తదుపరి చిత్రం మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండేలానే చేస్తున్నాడు. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తోన్న లవ్ స్టోరీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సినిమా భారీ హైప్ను క్రియేట్ చేశాయి.
మళ్లీ ఫిదా లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నాడు. మామూలుగా 2020 సమ్మర్ కానుకగా అనుకున్న సినిమా ఇలా వాయిదా పడుతూ వచ్చింది. లాక్డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత సహజసిద్దమైన లొకేషన్లలో లవ్ స్టోరీని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. నిజామాబాద్లోని సిద్దుల గుట్టలో చేసిన సీన్స్, వాటికి సంబంధించి బయటకు వచ్చిన పిక్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి.
తాజాగా మరోసారి లవ్ స్టోరీ టీం అందరినీ సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతి పండుగను లవ్ స్టోరీ టీం కాస్త ముందుగానే తీసుకొస్తోంది. లవ్ స్టోరీ టీజర్తో సంక్రాంతి పండుగను మరింత కలర్ ఫుల్గా చేసేందుకు రెడీ అయింది. జనవరి 10న లవ్ స్టోరీ టీజర్ రాబోతోందని ప్రకటించారు. జనవరి 10న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు టీజర్ రాబోతోందని తెలిపారు.