Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
పెళ్లి రోజున.. చైతూకు సమంత ఎమోషనల్గా మెసేజ్.. ఏమని చెప్పారంటే..
దక్షిణాదిలో అత్యంత పాపులర్ అయిన యువ దంపతులు నాగచైతన్య, సమంత అక్కినేని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరి వివాహం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత అక్కినేని ఎమోషనల్గా ట్వీట్ చేసింది. కొద్దిరోజులుగా క్రోయేషియా, ఐబిజాలో అక్కినేని ఫ్యామిలీ వేకేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారు ఎంజాయ్ చేసిన మూమెంట్లను సమంత, న నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకొన్న సంగతి తెలిసిందే. తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత ఏమన్నారంటే..
పెళ్లి రోజున సమంత ఫొటో షేర్
తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ క్యూట్ ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్బంగా సమంత, చైతూకు అభిమానులు లెక్కలేనన్నీ శుభాకాంక్షలు తెలిపారు. తన జీవితంలోకి చైతూ రావడం మధురమైన అనుభూతి అని సమంత పేర్కొన్నది. గతేడాది గోవాలో ఘనంగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.
నీ కోసం ఇంటికి వచ్చే
చైతన్యను ఉద్దేశించి ప్రతీ రోజు నీ కోసం ఇంటికి వచ్చే క్షణాలు నా జీవితంలో గొప్ప విషయం. ఏడాది వైవాహిక జీవితంలో నీతో భాగమవ్వడం గొప్ప అనుభూతి. అందుకు చాలా గర్వంగా ఉంది అని సమంత ఇన్స్టాగ్రామ్లో ఫోటోను పెట్టింది.
అక్కినేని ఫ్యామిలీ వెకేషన్
దేవదాస్ చిత్రం రిలీజ్కు ముందే నాగచైతన్య, సమంత, అఖిల్ వెకేషన్ కోసం ఐబిజాకు వెళ్లారు. దేవదాస్ ప్రమోషన్ తర్వాత నాగార్జున, అమల వారితో జతకలిశారు. ఇటీవల వెకేషన్ పూర్తి చేసుకొని నాగార్జున కుటుంబం హైదరాబాద్కు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా డ్రీమ్డ్ హాలీడే పూర్తయింది. వాస్తవ జీవితంలోకి తిరిగి వచ్చాం అని నాగార్జున ఫేస్బుక్లో వెల్లడించారు.
శివ నిర్మాణ సినిమాలో
కెరీర్ పరంగా సమంత, నాగచైతన్య కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. నిన్ను కోరి చిత్రం దర్శకుడు శివ నిర్వాణ ఆ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తారు. ఇంకా పేరుపెట్టని చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్తుంది.