Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
నా లైఫ్ లైన్స్.. నమ్రత ఎమోషనల్గా.. క్రేజీగా మహేష్.. ఫ్యాన్స్ ఫిదా.. వైరల్గా ఫోటోలు
సూపర్స్టార్ మహేష్బాబు సతీమణి, అలనాటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. వీలు చిక్కితే తన భర్త, పిల్లల ఫోటోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటారు. తన కుటుంబంలోని తీపి గుర్తులను ప్రిన్స్ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకొంటారు. తాజాగా నమత్ర పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేమిటంటే..
ఎమోషనల్గా నమ్రత శిరోద్కర్ ఫోటో షేర్
ప్రిన్స్ మహేష్ బాబు, కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో నమ్రత షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నవారంతా నా జీవన రేఖలు (లైఫ్లైన్స్) అంటూ ఓ పోస్టు పెట్టారు. ఈ ఫోటోకు అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా లవ్లీ ఫ్యాన్స్, బ్యూటీఫుల్ కపుల్స్ అంటూ ఫ్యాన్స్ వారికి విషెస్ చెబుతూ రకరకాలా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా నమ్రత
ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పిన నమత్ర బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా మారారు. ఏఎంబీ సినిమాస్, మహేష్కు సంబంధించిన యాడ్స్, బ్రాండింగ్, సినిమా ఓవర్సీస్, బాలీవుడ్ బిజినెస్లను దగ్గరుండి చూసుకొంటున్నారు. అంతేకాకుండా మహేష్ చేసే ప్రాజెక్టులను ఇప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.
మహర్షిగా ప్రిన్స్ మహేష్ బాబు
మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే మహేష్, పూజా హెగ్డేపై అన్నపూర్ణ స్టూడియోలో రెండు పాటలను చిత్రీకరించారు. తాజాగా పాటకు సంబంధించిన మహేష్ ఫోటోను రిలీజ్ చేయగా క్రేజీగా మారింది.
మే 9న మహర్షి విడుదల
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ మహర్షి చిత్రం మే 9న రిలీజ్ అవుతున్నది. నిర్మాత అశ్వినీదత్కు అత్యంత సెంటిమెంట్గా ఉండే తేదీ అది. ఆ రోజున జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి రిలీజై మంచి విజయాలు అందుకొన్నారు. మహర్షి సినిమాను సెంటిమెంట్గా అదేరోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.