Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎన్టీఆర్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేదు.. నా జీవితంలో మరచిపోను!
హీరోల ద్విపాత్రాభినయంతో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ త్రిపాత్రాభినయంలో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాడు. జై లవకుశ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. ఈ చిత్ర విజయాన్ని గుర్తు చేసుకున్న దర్శకుడు బాబీ ఎమోషనల్ గా స్పందించాడు. ఎన్టీఆర్ ని మూడు విభిన్న కోణాలలో చూపించడంలో బాబీ జైలవకుశ చిత్రం ద్వారా విజయం సాధించాడు.
ఘన విజయం
ఏడాది క్రితం ఇదే రోజున విడుదలైన ఎన్టీఆర్ జైలవకుశ చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేశాడు. మూడు పాత్రల్లో మూడు విభిన్న హావభావాలు చూపించడం అంత సులువు కాదు. కానీ ఎన్టీఆర్ మంచినీళ్లు తాగినంత సులువుగా ఆ పాత్రల్లో ఒదిగిపోయాడు.
జై పాత్రలో విశ్వరూపం
ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో అయితే ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఓవైపు నత్తితో నటిస్తూనే అద్భుతమైన హావభావాలు పలికించాడు. జైపాత్రకు తగ్గట్లుగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం ఈ చిత్రంలో మరో అద్భుతం.
|
ఇంకొకరిని ఊహించుకోలేదు
ఈ చిత్ర దర్శకుడు బాబీ ట్వీట్ చేస్తూ.. జైలవకుశ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్ డే ఫస్ట్ షోకు వచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మరచిపోలేను. జై పాత్రలో ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేదు అని బాబీ అన్నాడు. ఇప్పటికి ఎవరో ఒకరు జై పాత్ర గురించి మాట్లాడుతూనే ఉండడం సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రాన్ని మరోస్థాయికి చేర్చిందని బాబీ తెలిపాడు.
ప్రతిభ గల దర్శకుడిగా
పవర్ చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న బాబీ జైలవకుశ చిత్రంతో తన ప్రతిభని మరోమారు నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు వెంకటేష్, నాగ చైతన్యలతో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.