Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెంచల్ దాస్ను సత్కరించిన పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి కూడా ముచ్చటపడి..
ప్రస్తుతం టాలీవుడ్లో పెంచల్ దాస్ పేరు మార్మోగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ముచ్చటపడి మరీ పాడించుకున్నాడు. నిన్నటి శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెంచల్ దాసి పాడిన భలేగా ఉంది బాల పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక చివర్లో చిరంజీవి అడిగి మరీ పాడించుకున్నాడు. పెంచల్ దాస్ గ్రాతం, ఆయన రచన ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటోంది. అరవింద సమేతలో ఆయన పాడిన రాసిన పాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.
అంతకు ముందు కృష్ణార్జున యుద్దం సినిమా కోసం రాసిన దారి చూడు అనే పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు శ్రీకారం పాటతో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చేశాడు. ఈ క్రమంలో పెంచల్ దాస్తో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ముచ్చటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి పెంచల్ దాస్ను సత్కరించారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సెట్లో ఈ భేటీ జరిగినట్టు కనిపిస్తోంది.
రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ గారిని పవన్ కళ్యాణ్ సత్కారించారు. పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ గారు మంగళవారం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ గారు పాల్గొన్నారు.