twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ ఓ నరకం.. టాలీవుడ్‌ను వదిలి చాలా తప్పు చేశా.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

    |

    ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం బాలీవుడ్‌ను వేలెత్తి చూపుతోంది. బాలీవుడ్‌లోని మూవీ మాఫియా, నెపోటిజం, వారసత్వం, అర్హత లేని వారిని స్టార్స్‌గా చెక్కడం, ప్రతిభ ఉన్న వారిని తొక్కేయడం వంటి వాటిపైనే చర్చ నడుస్తోంది. అయితే ఒక్కొక్కరుగా బాలీవుడ్‌లోని అక్రమాలు, లొసుగులపై పెదవి విప్పుతున్నారు. ఇప్పటికే కంగనా రనౌత్ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

    కొందరు దర్శక నిర్మాతలు సైతం సుశాంత్ మృతిపై స్పందిస్తూ బాలీవుడ్‌ను నిందిస్తున్నారు. వివేక్ ఒబేరాయ్ సైతం తాజాగా బాలీవుడ్‌ను వేలెత్తి చూపాడు. తాజాగా ఊసరవెల్లి సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ సైతం సంచలన కామెంట్స్ చేసింది.

    సుశాంత్ మృతిపై..

    సుశాంత్ మృతిపై..

    డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ నేరం బాలీవుడ్‌దేనని నెటిజన్లు మండిపడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్య, డిప్రెషన్‌లపై స్పందిస్తూ పాయల్ ఘోష్ సైతం తన కథను వివరించింది.

    డిప్రెషన్‌కు లోనయ్యాను..

    డిప్రెషన్‌కు లోనయ్యాను..

    తాను కూడా డిప్రెషన్‌కు లోనయ్యానని, అయితే ఆత్మహత్య వంటి ఆలోచన చేయలేదని తెలిపింది. ఎందుకంటే తన చుట్టూ నిత్యం తన వాళ్లు ఉండేవారిని, స్నేహితులు, కుటుంబ సభ్యులు తన బాధను పంచుకునేవారని పేర్కొంది. అలా మెల్లిగా డిప్రెషన్‌లోంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది.

    తప్పుగా వాడుకోలేదు..

    తప్పుగా వాడుకోలేదు..

    దక్షిణాది నటులు సులభంగా దొరుకుతారని బాలీవుడ్ జనాలు తనను ఎంతో నీచంగా మాట్లాడరని, అగౌరవ పరిచారని తెలిపింది. తాను జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి, జాతీయ అవార్డులు తీసుకున్న వారితోనూ పని చేశానని పేర్కొంది. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా వారెప్పుడూ తనను తప్పుగా వాడుకోవాలని చూడలేదని తెలిపింది. బాలీవుడ్ దక్షిణాదిని తక్కువ చేసి చూస్తుందని చెప్పుకొచ్చింది.

    బాలీవుడ్ ఓ నరకం..

    బాలీవుడ్ ఓ నరకం..

    సుశాంత్ మృతి పట్ల కలత చెందిన పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మరో ట్వీట్ చేసిన పాయల్.. ‘మళ్లీ రిపీట్ చేస్తున్నా.. సౌత్ సినీ ఇండస్ట్రీ స్వర్గం.. బాలీవుడ్ ఓ నరకం.. మమ్మల్ని క్షమించు సుశాంత్.. మేము ఫెయిల్ అయ్యామ'ని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
    వారు గుడి కడతారు..

    వారు గుడి కడతారు..

    వరుస ట్వీట్లు చేసిన పాయల్ బాలీవుడ్‌ను ఏకిపారేసింది. తాజాగా మరో ట్వీట్ చేస్తూ.. ‘దక్షిణాది వారు హీరోయిన్లకు గుళ్లు కడతారు.. కానీ బాలీవుడ్ మాత్రం చచ్చేలా అగౌరవపరుస్తుంది. టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక్కడ దీనికి ఎలాంటి ఎమోషన్స్ లేవు' అని కామెంట్స్ చేసింది.

    English summary
    Payal Ghosh Criticise Bollywood On Sushant Suicide. South make temple for their heroines and Bollywood disrespect them to the death.. I made a huge mistake leaving Tollywood and get carried away with Bollywood, who doesn’t have any emotions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X