Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దక్షిణాది వారికి అది చూపిస్తే చాలు.. మంటపెట్టిన పూజా హెగ్డే కామెంట్స్
ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అనే ఓ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అవసరం ఉన్నంత వరకు మంచిగా గొప్పగా మాట్లాడతారు.. అవసరం తీరాక అసలు సంగతి బయటపెడతారు. అచ్చం పూజా హెగ్డేలానే. సౌత్ ఇండస్ట్రీ అదీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ఇక్కడి ప్రేక్షకులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది ప్రేక్షకులను టేస్టే లేదన్నట్టుగా తీసిసారేసింది. ఇలా దక్షిణాదిలో పేరు, డబ్బు, కీర్తి అన్నీ సంపాదించుకున్నాక.. ఉత్తరాదికి వెళ్లి ఇక్కడి వారిని కించపర్చడం మామూలు అయిపోయింది.
ఆ మధ్య తాప్సీ..
తెలుగు సినిమాలతో పాపులర్ అవుతారు..స్కిన్ షో చేస్తారు.. గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతారు.. మంచి పేరు సంపాదించుకుంటారు. బాలీవుడ్కు చెక్కేస్తారు. తీరా అక్కడ సక్సెస్ అయ్యాక, అవ్వడం కోసం సౌత్ను చిన్న చూపు చూస్తారు. ఆ మధ్య తాప్సీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీద చేసిన కామెంట్స్ కించపరిచేలా ఉండటంతో తాప్సీని నెటిజన్లు ఏకిపారేశారు.
తాజాగా పూజా హెగ్డే..
తాజాగా పూజా హెగ్డే కూడా సంచలన కామెంట్స్ చేసింది. ముకుంద సినిమాతో ఇక్కడ మంచి పేరు సంపాదించుకుంది. మళ్లీ బాలీవుడ్లో మొహంజదారో చిత్రంలో నటించింది. అది డిజాస్టర్ కావడంతో ఖాళీగా ఉండిపోయింది. మళ్లీ తెలుగు సినిమానే తనకు వరంగా మారింది. డీజే సినిమాలో అందాలను ఆరబోసి అందర్నీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి పూజా వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక్కడి క్రేజుతో మళ్లీ బాలీవుడ్లో ఆఫర్స్ కొట్టేసింది. అలాంటి ఇండస్ట్రీ మీద, ఆడియెన్స్ మీద సంచలన కామెంట్స్ చేసింది.
నడుము, మిడ్ డ్రెస్..
దక్షిణాది వారికి నడుముపై ధ్యాస ఉంటుంది. అది చూపిస్తే చాలు. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారు. అంతేకాకుండా మిడ్ డ్రెస్లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా అల వైకుంఠపురములో తన కాళ్లను చూపించారని చెప్పుకొచ్చింది.
మండిపడుతున్న నెటిజన్స్..
సౌత్ ఆడియన్స్ మీద పూజా హెగ్డే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయి. అన్నం పెట్టిన ఇండస్ట్రీ, ప్రేక్షకులను కించపరుస్తావా? నిన్ను ఎవడు చూపించమన్నాడు? అలాంటి పాత్రలు ఎందుకు చేశావ్ మరి? అంటూ ఇష్టమొచ్చినట్టుగా పూజా హెగ్డేను ఏకిపారేస్తున్నారు.