Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెగ గట్టిగానే తగిలినట్టుంది.. నడుము వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన పూజా హెగ్డే
మంచి క్రేజ్, ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు హీరోయిన్లకు వివాదాలు చుట్టుముడితే కాస్త కష్టమే అవుతుంది. హీరోయిన్లు కావాలని వివాదాలు క్రియేట్ చేసుకుంటే ఓ ఇమేజ్ వస్తుంది.. వేరేవారి వల్ల వివాదాల్లో చిక్కుకుంటో మరో రకమైన ఇమేజ్ వస్తుంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. కానీ వివాదాల్లో చిక్కుకుంటూ ఇమేజ్ బ్యాడ్ చేసుకుంటోంది. ఆ మధ్య సమంతపై కామెంట్లు చేసి.. అకౌంట్ హ్యాక్ అయిందని కబుర్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్యూలో దక్షిణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. టాలీవుడ్పైనా సెటైర్లు వేసింది.
తాజాగా పూజా హెగ్డే..
దక్షిణాది వారికి నడుముపై ధ్యాస ఉంటుంది. అది చూపిస్తే చాలు. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారు. అంతేకాకుండా మిడ్ డ్రెస్లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురములో తన కాళ్లను చూపించారని చెప్పుకొచ్చింది. ఇలా సౌత్ను, టాలీవుడ్ను కించపర్చడం ఇక్కడి వారు హర్ట్ అయ్యారు.
ఏకిపారేశారు..
డబ్బు సంపాదించుకున్న చోటు.. నిలబడి ఎదిగిన చోటు.. అన్నం పెట్టిన ఇండస్ట్రీ.. ప్రేమను కురిపించే అభిమానులను కించపరిచేలా పూజా హెగ్డే వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పూజా హెగ్డేను సోషల్ మీడియాలో దారుణంగా ఏకిపారేవారు. ట్రోలింగ్తో పూజా హెగ్డేను ఓ రేంజ్లో ఆడుకున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని గుర్తించిన పూజా హెగ్డే దిద్దుబాటు చర్యలను చేపట్టింది.
రుణపడే ఉంటాను..
‘నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి' అని పూజా హెగ్డే కోరింది.
Recommended Video
స్టార్ హీరోయిన్గా..
ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్లో నటిస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ మధ్యే రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది.. మళ్లీ తిరిగి వచ్చి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్రల్ షూటింగ్లో పాల్గొంది.