Don't Miss!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సెగ గట్టిగానే తగిలినట్టుంది.. నడుము వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన పూజా హెగ్డే
మంచి క్రేజ్, ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు హీరోయిన్లకు వివాదాలు చుట్టుముడితే కాస్త కష్టమే అవుతుంది. హీరోయిన్లు కావాలని వివాదాలు క్రియేట్ చేసుకుంటే ఓ ఇమేజ్ వస్తుంది.. వేరేవారి వల్ల వివాదాల్లో చిక్కుకుంటో మరో రకమైన ఇమేజ్ వస్తుంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. కానీ వివాదాల్లో చిక్కుకుంటూ ఇమేజ్ బ్యాడ్ చేసుకుంటోంది. ఆ మధ్య సమంతపై కామెంట్లు చేసి.. అకౌంట్ హ్యాక్ అయిందని కబుర్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్యూలో దక్షిణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. టాలీవుడ్పైనా సెటైర్లు వేసింది.
తాజాగా పూజా హెగ్డే..
దక్షిణాది వారికి నడుముపై ధ్యాస ఉంటుంది. అది చూపిస్తే చాలు. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారు. అంతేకాకుండా మిడ్ డ్రెస్లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురములో తన కాళ్లను చూపించారని చెప్పుకొచ్చింది. ఇలా సౌత్ను, టాలీవుడ్ను కించపర్చడం ఇక్కడి వారు హర్ట్ అయ్యారు.
ఏకిపారేశారు..
డబ్బు సంపాదించుకున్న చోటు.. నిలబడి ఎదిగిన చోటు.. అన్నం పెట్టిన ఇండస్ట్రీ.. ప్రేమను కురిపించే అభిమానులను కించపరిచేలా పూజా హెగ్డే వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పూజా హెగ్డేను సోషల్ మీడియాలో దారుణంగా ఏకిపారేవారు. ట్రోలింగ్తో పూజా హెగ్డేను ఓ రేంజ్లో ఆడుకున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని గుర్తించిన పూజా హెగ్డే దిద్దుబాటు చర్యలను చేపట్టింది.
రుణపడే ఉంటాను..
‘నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి' అని పూజా హెగ్డే కోరింది.
Recommended Video
స్టార్ హీరోయిన్గా..
ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్లో నటిస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ మధ్యే రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది.. మళ్లీ తిరిగి వచ్చి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్రల్ షూటింగ్లో పాల్గొంది.