Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రాధే శ్యామ్’తో ప్రభాస్ సోదరి టాలీవుడ్ ఎంట్రీ.. రెబెల్ స్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని సూపర్ హిట్లను అందుకున్నాడు. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఒక, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి అతడు భారీ చిత్రాలతోనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సోదరిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు ప్రభాస్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!
యూనివర్శల్ స్టార్.. అన్ని చోట్లా మార్కెట్
కెరీర్ ఆరంభంలో ఓ మాదిరి సినిమాలు చేసి చక్కని ఫలితాలు రాబట్టుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో అతడు యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో మార్కెట్ కూడా పెంచుకోగలిగాడు.
‘సాహో' ఫలితంతో జోష్.. అందుకే ఇలా ప్లాన్
‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయితే, హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇకపై తాను నటించే చిత్రాలన్నీ హిందీలోనూ తెరకెక్కించాలని ప్రభాస్ డిసైడ్ అయ్యాడని టాక్.
మరో భారీ చిత్రం.. ప్రభాస్లోని కొత్త కోణం
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్గా కనిపిస్తాడని సమాచారం.
‘రాధే శ్యామ్'... కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసింది చిత్ర యూనిట్. ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
‘రాధే శ్యామ్'తో ప్రభాస్ సోదరి టాలీవుడ్ ఎంట్రీ
సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ హైలైట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది తమ వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో చాలా మంది హీరో, హీరోయిన్లుగా పని చేస్తున్నారు. కొందరు మాత్రం దర్శకులు, ప్రొడ్యూసర్లు, ఇతర టెక్నీషియన్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్.. తన సోదరిని ‘రాధే శ్యామ్'తో టాలీవుడ్కు పరిచయం చేస్తున్నాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్తో బయటకు వచ్చిన న్యూస్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్'కు తన సోదరి ప్రసీద ఉప్పలపాటిని నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈమె సీనియర్ హీరో కృష్ణం రాజు పెద్ద కుమార్తె. ఈ విషయం తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. యూవీ నిర్మాతలు ప్రమోద్, వంశీ పక్కనే ప్రసీద పేరు ఉండడం గమనార్హం.
Recommended Video
రెబెల్ స్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా.!
వాస్తవానికి ఈ సినిమాను కృష్ణం రాజు తన సొంత బ్యానర్ గోపీ కృష్ణ సంస్థలో నిర్మించాలని భావించారు. అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అలాంటి సమయంలో ప్రభాస్ స్నేహితుల సంస్థ యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో దీనిని పట్టాలెక్కించారు. అదే సమయంలో ప్రభాస్ సలహా మేరకు తన కుమార్తెను నిర్మాతగా మార్చారని సమాచారం.