Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అప్పుడు విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రానాతో సమంత రచ్చ
ఆహా యాప్ కోసం సమంత ఓ స్పెషల్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండతో మొదటి ఎపిసోడ్ను చేసేసింది. శామ్ జామ్ అనే ఈ షోపై విభిన్న కామెంట్లు వచ్చినా కూడా బాగానే క్లిక్ అయింది. మొదటిసారి సమంత ఓ షోను హోస్ట్ చేయడంతో శామ్ జామ్ బాగానే జనాల్లోకి చేరువైంది. విజయ్ దేవరకొండతో చేసిన ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో బాగానే క్లిక్ అయింది. ఈ మధ్యే ఈ షోలో చిరంజీవి కూడా పాల్గొన్నాడు.
షో షూట్ కోసం బయటకు వచ్చిన మెగాస్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి. ఇక రెండో ఎపిసోడ్ చిరంజీవితోనే ఉంటుందని అంతా భావించారు. కానీ రెండో ఎపిసోడ్ మాత్రం కుర్రాళ్లతోనే ప్లాన్ చేసింది శామ్ జామ్ టీం. మొదటి ఎపిసోడ్లో మహానటి సినిమాలో తనకు సపోర్ట్ చేసిన విజయ్ను మొదటి ఎపిసోడ్తో గెస్ట్గా తీసుకొస్తే రెండో ఎపిసోడ్కు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ను తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో రానా, నాగ్ అశ్విన్, సమంత ముచ్చటించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ రానాల పరిచయం లీడర్ సినిమా దగ్గరి నుంచి మొదలైందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఇద్దరు స్నేహితులతో సమంత స్పెషల్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక రానా, నాగ్ అశ్విన్లకు సంబంధించిన రహస్యాలు ఎన్ని బయటపడతాయో చూడాలి.