Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
అప్పుడు విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రానాతో సమంత రచ్చ
ఆహా యాప్ కోసం సమంత ఓ స్పెషల్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండతో మొదటి ఎపిసోడ్ను చేసేసింది. శామ్ జామ్ అనే ఈ షోపై విభిన్న కామెంట్లు వచ్చినా కూడా బాగానే క్లిక్ అయింది. మొదటిసారి సమంత ఓ షోను హోస్ట్ చేయడంతో శామ్ జామ్ బాగానే జనాల్లోకి చేరువైంది. విజయ్ దేవరకొండతో చేసిన ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో బాగానే క్లిక్ అయింది. ఈ మధ్యే ఈ షోలో చిరంజీవి కూడా పాల్గొన్నాడు.
షో షూట్ కోసం బయటకు వచ్చిన మెగాస్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి. ఇక రెండో ఎపిసోడ్ చిరంజీవితోనే ఉంటుందని అంతా భావించారు. కానీ రెండో ఎపిసోడ్ మాత్రం కుర్రాళ్లతోనే ప్లాన్ చేసింది శామ్ జామ్ టీం. మొదటి ఎపిసోడ్లో మహానటి సినిమాలో తనకు సపోర్ట్ చేసిన విజయ్ను మొదటి ఎపిసోడ్తో గెస్ట్గా తీసుకొస్తే రెండో ఎపిసోడ్కు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ను తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో రానా, నాగ్ అశ్విన్, సమంత ముచ్చటించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ రానాల పరిచయం లీడర్ సినిమా దగ్గరి నుంచి మొదలైందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఇద్దరు స్నేహితులతో సమంత స్పెషల్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక రానా, నాగ్ అశ్విన్లకు సంబంధించిన రహస్యాలు ఎన్ని బయటపడతాయో చూడాలి.