twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య పాలిట విలన్ అవుతున్న రోజా.. అసలేం జరుగుతున్నదంటే..

    By Manoj Kumar P
    |

    సీనియర్ హీరోయిన్ రోజా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి. రెండో తరంలోని అందరు హీరోలతో నటించిన ఈమె.. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఎన్నో భాషల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సంప్రదాయ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన రోజా.. గ్లామర్ క్యారెక్టర్లతో కుర్రకారును ఉర్రూతలూగించారు.

    ఇక, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో రోజా.. నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేయబోతున్నారని తెలిసింది. దీనికి కారణం ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే...

    ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు

    ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధులు

    ఇటు రోజా.. అటు బాలకృష్ణ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేరు వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఒకవైపు ప్రజా సేవ చేస్తూనే, మరోవైపు తమ వృత్తి పట్ల నిబద్ధతతో పని చేస్తున్నారు. బాలయ్య సినిమాలతో బిజీగా ఉంటే.. రోజా మాత్రం టీవీ షోలు చేస్తున్నారు.

    ‘రూలర్'గా మారిపోయాడు

    ‘రూలర్'గా మారిపోయాడు

    గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ‘రూలర్' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు.

    హ్యాట్రిక్ కోసం కలవబోతున్నారు

    హ్యాట్రిక్ కోసం కలవబోతున్నారు

    నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గతంలో ‘సింహా', ‘లెజెండ్' అనే సినిమాలు చేశారు. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. వీటి తర్వాత ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది. బోయపాటి ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

    బాలయ్య కోసం అక్కడికి వెళ్తున్నాడు

    బాలయ్య కోసం అక్కడికి వెళ్తున్నాడు

    బాలయ్యతో చేసే సినిమా కోసం కూడా బడా విలన్‌నే వెతికే పనిలో పడ్డాడట బోయపాటి శ్రీను. మొదట్లో ఈ పాత్ర కోసం జగపతిబాబును అనుకున్నప్పటికీ ఎందుకో మనసు మార్చుకున్నాడని తెలిసింది. ఇక, ఇటీవల బయటకొచ్చిన సమాచారం ప్రకారం.. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌ను విలన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట.

    రోజా టార్గెట్ బాలయ్యే.. భీకర పోరు ఖాయం

    రోజా టార్గెట్ బాలయ్యే.. భీకర పోరు ఖాయం

    ఇక, ఇదే సినిమాలో ఓ లేడీ విలన్ పాత్ర కూడా ఉంటుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ పాత్ర కోసం దర్శకుడు బోయపాటి శ్రీను రోజాను సంప్రదించాడని ప్రచారం జరుగుతోంది. దీనికి ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే రాజకీయ ప్రత్యర్ధులు.. రియల్ ప్రత్యర్ధులు కూడా కాబోతున్నారన్న మాట.

    Recommended Video

    #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
    ఒంటి చేతితో నడిపిస్తున్న రోజా

    ఒంటి చేతితో నడిపిస్తున్న రోజా

    ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘జబర్ధస్త్' షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన ఈ వారం నుంచి షోకు అందుబాటులో ఉండడం లేదు. అయినప్పటికీ మరో జడ్జ్ అయిన రోజా ఒంటి చేతితో షోను నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలైంది.

    English summary
    Director Boyapati Srinu will be directing Nandamuri Balakrishna in his next movie. There are more expectations from the fans on the combination of Boyapati Srinu and Balakrishna because of previous hit movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X