Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రాజమౌళి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో... ఎన్టీఆర్ ముందే ఊహించాడు!
Recommended Video
బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మరో భారీ చిత్రం RRR. మొదటి షెడ్యూల్ తర్వాత అనుకోని కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు రెండవ షెడ్యూల్ మంగళవారం బల్గేరియాలో ప్రారంభమైంది. ఇక్కడ జూ ఎన్టీఆర్పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. త్వరలో వెండి తెరపై తుఫాను క్రియేట్ చేయబోతున్న దర్శకుడు రాజమౌళి బల్గేరియా సెట్లో అలాగే ప్రశాంతంగా కనిపించాడని చెబుతూ ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ ఫోటో షేర్ చేశారు.
రాజమౌళి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో... ఎన్టీఆర్ ముందే ఊహించాడు
బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి' క్రియేట్ చేసిన స్ట్రోమ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్ల వసూల్లు అనేవి లేవు. బాహుబలి 2 ఫుల్ రన్లో దాదాపు రూ. 1800 కోట్ల విధ్వంసకర వసూళ్లతో రికార్డులన్నీ బద్దలు కొడుతూ సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న రాజమౌళి ఎఫెక్ట్ బాక్సాఫీస్పై వచ్చే ఏడాది ఎలా ఉంటుందో యంగ్ టైగర్ ముందే ఊహించాడు. అందుకే అతడిని ఉద్దేశించి ‘ది మ్యాన్ బిఫోర్ ది స్ట్రోమ్' అంటూ కామెంట్ చేశాడు.
బల్గేరియా సెట్లో రాజమౌళి
మార్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ "ఈ చిత్రం అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఉంటుంది. ఈ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల్లో మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో కొంతకాలం పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో వారు కలుసుకుని ఉంటే ఏమి జరిగి ఉండేదో అనే ఒక కల్పిత కథతో చూపించాలనుకుంటున్నాము, " అన్నారు.
ఎన్టీఆర్, చరణ్
జూ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటించనున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, అలియా భట్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు. అలియా రామ్ చరణ్కు జోడీగా కనిపించనుంది. ఎన్టీఆర్కు జోడీగా విదేశీ నటి కనిపించబోతోంది. గతంలో డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ పాత్రకు ఎంపికవ్వగా మధ్యలో తప్పుకుంది. దీంతో మరొక నటి కోసం వేట సాగుతోంది.
బాహుబలి మించే స్థాయిలో
ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా జూలై 30, 2020న 10 భారతీయ భాషల్లో విడుదల కానుంది. డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు సినిమా గొప్పదనం మరింత పెంచేలా
బాహుబలి తరువాత తెలుగు సినిమా గొప్పదనాన్ని మరింత పెంచే ఉన్నత ప్రమాణాలతో RRR చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలోని టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.