Don't Miss!
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోదీ పిలుపును హాట్ షోగా మార్చిన హీరోయిన్.. కొవ్వొత్తుల వెలుగులో కేక పుట్టించే ట్రీట్.!
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్ (కోవిద్ -19). దీని ధాటికి దాదాపు 195 దేశాలు విలవిల్లాడుతున్నాయి. దీంతో చాలా చోట్ల లాక్ డౌన్ కొనసాగుతోంది. మనదేశంలో కూడా చాలా రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపాలు వెలిగించమని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ సెమీ న్యూడ్గా కొవ్వొత్తులు వెలిగించి హాట్ టాపిక్ అవుతోంది.
దేశ ప్రజలకు మోదీ పిలుపు.. భారీ స్పందన
కరోనా వైరస్ ప్రభావంలోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లకు గౌరవ సూచికంగా చప్పట్లు కొట్టమని గతంలో పిలుపునిచ్చిన మోదీ.. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీపాలు వెలిగించమని ప్రజలను కోరారు. దీనికి దేశంలోని అన్ని వర్గాల వారి నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.
|
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ సెలెబ్రిటీలు
ప్రధాని పిలుపు మేరకు భారతదేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు సైతం దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ సహా ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు దీపాలు వెలిగించి మోదీకి మద్దతు ప్రకటించారు.
దీపం వెలిగించమంటే సిగరెట్ వెలిగించాడు
ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలు, సెలెబ్రిటీలు అందరూ దీపాలు వెలిగిస్తే.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం సిగరెట్ వెలిగించాడు. అంతేకాదు, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వివాదాలతో సహవాసం చేసే వర్మ.. తిక్క పని చేయడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
మోదీ పిలుపును హాట్ షోగా మార్చిన హీరోయిన్
ఎవరు ఎలా చేస్తే నాకేంటి.. నేను మాత్రం నాలాగే చేస్తాను అనుకుందో ఏమో గానీ.. బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా మాత్రం మోదీ పిలుపును హాట్ షోగా మార్చేసింది. అందరిలా కాకుండా సెమీ న్యూడ్గా కొవ్వొత్తులు వెలిగించి షాకిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
ఎప్పుడూ అందాలతో కనువిందు చేస్తోంది
తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది హైదరాబాదీ హీరోయిన్ షెర్లిన్ చోప్రాం. ఈ బోల్డ్ బ్యూటీ కొద్దిరోజులుగా న్యూడ్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తన అందాలతో కనువిందు చేస్తూనే ఉంది.
Recommended Video
మన హైదరాబాదీ అమ్మాయే.. అలా అయిపోయింది
షెర్లిన్ చోప్రా హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువు పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో కలిసి రాకపోవడంతో ముంబై వెళ్లింది.