Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎడారిలో ఎంజాయ్.. సితార ఘట్టమనేని పిక్స్ వైరల్
మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. నమ్రత బర్త్ డే కోసం దుబాయ్ వెళ్లిన ఫ్యామిలీ.. సర్కారు వారి పాట షూటింగ్ కోసం అక్కడే ఉండిపోయింది. సర్కారు వారి పాట షెడ్యూల్ను దుబాయ్లో భారీ ఎత్తులో షూట్ చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్లో మహేష్ బాబు దుమ్ములేపుతున్నాడట. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు దుబాయ్లోనే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సీన్స్ కూడా జరుగుతున్నాయట.
అయితే షూటింగ్ మధ్యలో గ్యాప్ లేదా షూటింగ్లకు బ్రేక్ వస్తే మాత్రం మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎంచక్కా బయటకు చెక్కేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఎడారిలో ట్రిప్ వేశాడు. అక్కడ ఉండే వెరైటీ జీపులు, ఒంటెల మీద ప్రయాణాలు చేశారట. ఈ విషయాన్ని సితార తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ తెగ సంబరపడిపోయింది. ఇందులో మహేష్ బాబు కూడా బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నాడు.
మొదటిసారిగా ఎడారిలో ఇలా ట్రిప్కు వెళ్లాను అని సితార చెప్పుకొచ్చింది. ఇందులో జీపులు, ఒంటెలు, భగ్గీల మీద ప్రయాణం చేశాను అని సితార తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సితార షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ నెల చివరి వరకు మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. సర్కారు వారి పాటను వచ్చే ఏడాది సంక్రాంతిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చిత్రయూనిట్ బాగా కష్టపడుతోన్నట్టుంది.