Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్లాష్ బ్యాక్ : ఆ ఒక్కటి బాకీ పడ్డాడు.. ఇంకా ఇవ్వలేదని భారతీ రాజాపై ఎస్పీబీ ఫిర్యాదు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లెజెండరీ దర్శకుడు భారతీ రాజా మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కూడా సినిమా రంగానికి రాక ముందు నుంచీ స్నేహితులే. నాటక రంగంలో ఇద్దరూ కలిసి నటించేవారు. అక్కడ బాలు పాడుతూ ఉంటే, భారతీ రాజా నాటకాలు వేసే వారు. అయితే ఓ సారి అక్కడో విచిత్ర ఘటన జరిగిందట. ఆ సంఘటన గురించి బాలు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
ఆనాడే భారతీ రాజా టాలెంట్..
భారతీ రాజా టాలెంట్ను ప్రపంచం చూడక ముందు తాను చూశానని ఎంతో గొప్పగా చెప్పేవారు బాలుగారు. అతను ఒక్కో కథ చెబుతుంటే సీన్ వివరిస్తూ ఉంటే షాక్ అయ్యేవాడినని తెలిపేవారు. అయితే ఇంత అడ్వాన్స్గా ఉన్నాయి . ఈ సినిమాలు తీయగలమా? అని అడుగుతుంటే ఎప్పటికైనా తీసి చూపిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పేవారట భారతీరాజా.
ఓ నాటకంలో అలా..
ఓ నాటకంలో భారతీ రాజా కోట్ వేసుకుని నటించాలి. కానీ ఆయన దగ్గర లేకపోవడంతో.. తాను ఎంతో ముచ్చటపడి కొనుకున్న కోటును వేసుకుని నటించాడట భారతీ రాజా. అయితే ఆ నాటకంలో ఎంతో లీనమైన భారతీ రాజా ఎమోషనల్లో ఆ కోటును చించి అవతల పారేశారట.
ఇంకా ఇవ్వలేదు..
అయితే ఆ కోటు మాత్రం ఇప్పటికీ నాకు తిరిగి ఇవ్వలేదని భారతీరాజాపై ఎస్పీబీ సరదాగా ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కెరీర్ స్టార్టింగ్లో అవకాశాలు లేని సమయంలో ఒకరి కోసం ఇంకొరు రికమండ్ చేసుకునే వాళ్లమని తమది యాభై యేళ్ల అనుబంధమని, భారతీ రాజా తన స్నేహితుడని చెప్పేందుకు ఎంతో గర్వంగా ఫీలవుతానని బాలు చెప్పేవారు.
Recommended Video
భారతీ రాజా ఎమోషనల్..
ఎస్పీబీ మరణ వార్త విని భారతీ రాజా చలించిపోయారు. తాను బాధలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు రావంటూ ఎస్పీబీ మరణంతో భారతీ రాజా కుంగిపోయారు. కొన్ని సందర్భాల్లో మాటలు రావు.. మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరగవు.. పైన ఓ శక్తి అనేది ఉంటుంది. దాని ముందు మనమంత తలొంచాల్సిందే భారతీ రాజా ఎమోషనల్ అయ్యారు.