పవన్ కల్యాణ్ను బ్లాక్మెయిల్ చేసి కోట్లు భరణం.. పూనమ్ కౌర్ భండారం బయటపెట్టిన శ్రీరెడ్డి
పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎప్పటికీ తేలని విషయమే. కత్తి మహేష్ ఏనాడైతే ఈ వ్యవహారాన్ని మీడియా ముఖంగా అందరి ముందు పెట్టాడో ఆ క్షణం నుంచి అందరి మదిలోని ఆ విషయం నాటుకుపోయింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. వీటికి తోడు ఆ మధ్య లీకైన ఆడియో పెను సంచలనంగా మారింది. తాజాగా శ్రీ రెడ్డి వీరిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని బట్టబయలు చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...
Recommended Video

పీకే మాస్క్పై కౌంటర్..
పీకే లవ్ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ప్రత్యేకంగా తయారు చేసిన పీకే మాస్క్లను ధరించింది. వీటి గురించి సోషల్ మీడియాలో చెబుతూ.. పీకే మాస్క్ ధరించానని తెలిపింది. దానిపై శ్రీ రెడ్డి కౌంటర్ వేసింది.

దాని వెనకాల ఏముంది?
పూనమ్ కౌర్ పీకే మాస్క్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేస్తూ.. ‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??' అంటూ పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి కామెంట్స్కు పూనమ్ కాస్త గట్టిగానే స్పందించింది.

వేశ్య కంటే దారుణం..
పూనమ్ కౌర్ శ్రీ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది.‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం'అని పేర్కొంది.

కడుపు చేయించుకుని కోట్లు భరణం..
శ్రీ రెడ్డి మొత్తానికి పూనమ్ కౌర్ ముసుగు తీసేంది. తాజాగా చేసిన పోస్ట్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. శ్రీ రెడ్డి పోస్ట్ ఏమిటంటే.. ‘నాకు తెలిసిన ఒక వేశ్య కథ ,పూనమ్ ఒక 3 పెళ్ళిళ్ళైన ,ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకుని అతని లగ్జరీ అనుభవిస్తూ టాటూలు వేసుకుని నేను మిమ్మల్నీ మర్చిపోలేను అంటూ దొంగ ప్రేమ వొలగపోస్తూ,ఓ పక్క ఎలక్షన్స్ లో ఆయన్ని వాయిస్ రికార్డ్స్ తో ఓడించాలని కుతంత్రాలు పన్నిన ,సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా??వేరే పొలిటికల్ పార్టీస్ లో చేరి ఇంకా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు పెళ్లి చేస్కోవచ్చు అని ఎవరు ట్రై చేశారే పతివ్రతా??నీ ఎత్తుగడలు తెలీక పీకే బలయ్యాడు..పి ఫాన్స్ ఇదొక సైకో ముండ, ఇదొక విషపురుగు ..ఇది నిజం' అని పేర్కొంది.

నన్ను గెలికిందిరా..
పూనమ్ కౌర్ వ్యక్తిగత విషయాలు నీకెందుకు అంత అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. అది నన్ను గెలికింది రా అంటూ సమాధానం ఇచ్చింది. ఇక పూనమ్ కౌర్ తన మాస్క్ తీయకపోయే సరికి తానే తీశానని తెలిపింది. మొత్తానికి శ్రీ రెడ్డి మరో సంచలనం సృష్టించింది. ఇక వీటిపై పూనమ్ స్పందిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











