Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఏ వృత్తిలో ఉన్నా సరే మనం వారికే రుణపడతాం.. మైమరిచిపోతోన్న సుమ.. పిక్ వైరల్
యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు కేవలం బుల్లితెర, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే సందడి మాత్రమే చూస్తూ వచ్చాం. కానీ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సుమ చేసే రచ్చ పీక్స్లో ఉంటోంది. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాను సుమ ఓ ఊపు ఊపేసింది. వెరైటీ వీడియోలతో నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది.
వెరైటీ వీడియోలు..
లాక్డౌన్ సమయంలో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన పెట్ జోరోతో కలిసి రచ్చ రచ్చ చేసింది. వంటలు వండుతూ బోళ్లు కడుతూ డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించింది. ఇవే కాకుండా కరోనాపై అవగాహన కలిగించేందుకు కూడా కొన్ని వీడియోలను చేసింది.
మాస్క్ ధరించాలంటూ..
మాస్క్ ధరించాలంటూ సుమ ఫన్నీగా కొన్ని వీడియోలను చేసింది. సుమ చెప్పిన కామెడీగానే ఉన్నా కానీ ఎంతో మంచి సందేశాలను ఇస్తూ వచ్చింది. బయటకు వెళ్లినప్పుడు, పని చేస్తున్న ప్రదేశాల్లోనూ మాస్క్లు ధరించాలంటూ అందరినీ వేడుకుంది.
కొత్త షోతో హంగామా..
సుమ
తాజాగా
ఓ
కొత్త
షోను
ప్రారంభించేసింది.
బిగ్
సెలెబ్రిటీ
ఛాలెంజ్
అంటూ
యాంకర్
రవితో
పాటు
ఈ
కొత్త
షోను
నడిపించేందుకు
సుమ
సిద్దమైంది.
ఈపాటికే
ప్రోమోలతో
రచ్చ
రచ్చ
చేశారు.
మొదటి
ఎపిసోడ్లో
కౌశల్,
రాహుల్
సిప్లిగంజ్లు
సందడి
చేయబోతోన్నారు.
గౌరవం ఇవ్వాలి..
తాజాగా సుమ ఓ పోస్ట్ చేసింది. రైతుల దినోత్సవం సందర్భంగా సుమ.. మనం కంచెంలో రోజూ అన్నం వస్తుందంటే.. మన రైతులు రోజూ కష్టపడుతున్నారన్న మాట. మనకు అన్నం పెట్టేందుకు వారు కష్టపడుతున్నారు.. మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా.. రైతుల కష్టానికి, వారి అంతులేని శ్రమకు, అంకితభావానికి మనం గౌరవం ఇవ్వాల్సిందే.. అంటూ చెప్పుకొచ్చింది
మైమరిచిపోతోంది..
మన దేశానికి రైతు వెన్నుమొకలాంటి వాడు.. మనం సమాజంలో వారికి అత్యున్నత స్థానాన్ని కల్పించాలి..ఈ రైతుల దినోత్సవం సందర్భగా.. మన రైతులందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.. అంటూ సేద్యం చేస్తోన్న ఫోటోను, కాసిన కాయను పట్టుకుని మైమరిచిపోతోన్న ఫోటోలను సుమ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.