Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పెళ్లితో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దూరమయ్యారు, తమ్ముడు దమ్కీ: స్వాతి నాయుడు భర్త అవినాష్!
యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు ఇటీవల అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు-అవినాష్ తమ రిలేషన్ ఎలా మొదలైంది? పెళ్లి సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు తదితర విషయాలు వెల్లడించారు.
మొదట మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉండేవారం. తర్వాత మా స్నేహం రిలేషన్షిప్లా మారింది. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం అనిపించింది. ఆమె వీడియోల్లో, సినిమాల్లో ఏం చేసిన కెమెరా ముందు చేస్తుంది. ఇదంతా తన కెరీర్ కోసం చేస్తుంది. కెమెరా వెనక ఏమీ చేయదు. తనది ఎంతో మంచి మనసు.. అందుకే నచ్చిందని అవినాష్ చెప్పుకొచ్చారు.
అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు
అవినాష్ తల్లిదండ్రులకు నా గురించి, నేను చేస్తున్న రొమాంటిక్ వీడియోల గురించి తెలుసు. నేను స్వయంగా వెళ్లి వారితో మా పెళ్లి గురించి మాట్లాడారు. ఒప్పుకోలేదు. నా ప్రొఫెషన్, నేను చేస్తున్న వీడియోలు వారికి నచ్చలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. నాకు తప్ప ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమే అన్నారు. అందుకే వారిని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం... అని స్వాతి నాయుడు తెలిపారు.
మా నాన్న కూడా వెళ్లి మాట్లాడారు
మా పెళ్లి విషయం మా నాన్నకు చెబితే.. మీకు మీరు ఎలా డిసైడ్ అవుతారు? అబ్బాయి తరుపువారు కూడా ఒప్పుకోవాలిగా అన్నారు. మా నాన్న స్వయంగా వెళ్లి అవినాష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అయినా వారు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి గురించి మీకు తెలియదా? అలాంటి అమ్మాయికి మా అబ్బాయిని ఎలా ఇస్తాం? అంటూ నెగెటివ్గా మాట్లాడి ఫైనల్ గా నో చెప్పారని... స్వాతి నాయుడు గుర్తు చేసుకున్నారు.
కొడుకు లేడు, చచ్చిపోయావ్ అనుకుంటామన్నారు...
అవినాష్ పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పడంతో... అతడి తల్లిదండ్రులు మరింత సీరియస్ అయ్యారు. మాకు కొడుకులేడు, నువ్వు చచ్చిపోయావ్ అనుకుంటాం, నీ జీవితంతో మాకు సంబంధం లేదని చెప్పి పొమ్మన్నారు. వారు అలా చెప్పడంతో మేము ధైర్యంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని... స్వాతి చెప్పుకొచ్చారు.
అన్నింటికీ సిద్ధపడే వచ్చా: అవినాష్
స్వాతి నాయుడును పెళ్లి చేసుకోవడంతో నాపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తాయని తెలుసు. అన్నింటికీ సిద్దపడే పెళ్లి చేసుకున్నాను. అందుకే బాధ పడటం లేదు, వాటిని అసలు నేను పట్టించుకోను అని అవినాష్ స్పష్టం చేశారు.
సమాజం గురించి పట్టుచుకోను, ఫ్రెండ్స్ దూరం అయ్యారు
స్వాతి కోసం నేను నా ఫ్యామిలీని వదిలేసుకున్నాను. హ్యాపీగా ఉన్నాను. సమాజం ఏమంటుందనే విషయం నేను పట్టించుకోను.. పెళ్లి తర్వాత స్నేహితులు కూడా దూరం పెట్టారు. వారు స్వాతికి కడా ఫ్రెండ్సే... ఇపుడు మాత్రం స్వాతిని వదిలేయ్ అంటున్నారని... చెప్పుకొచ్చారు.
పెళ్లికి ముందు కూడా శోభనం జరిగింది
మా పెళ్లి విజయవాడలో జరిగింది. పెళ్లైన తర్వాత హనీమూన్ అక్కడే నాలుగు రోజులు గడిపాం. షూటింగ్స్ ఉండటంతో హైదరాబాద్ వచ్చేశాం. శోభనం పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. పెళ్లికి ముందు సీక్రెట్ గా జరిగేది. పెళ్లి తర్వాత పెద్దలందరూ కలిసి గదిలోకి పంపడం కాస్త సిగ్గుగా అనిపించిందని... స్వాతి నాయుడు తెలిపారు.
ఫ్యామిలీ దూరం అయిందనే చిన్న బాధ ఉంది
ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకుంటే బ్యాచిలర్ లైఫ్ పోయిందనే భయం ఉండేది. మేము ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టి భయం అనిపించలేదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయ్యారనే ఫీలింగ్ అయితే ఉంది. స్వాతి నాకు దక్కింది అనే హ్యాపీనెస్ ఉంది కానీ ఎక్కడో ఫ్యామిలీ లేదనే బాధ కూడా ఉందని అవినాష్ అన్నారు.
నా తమ్ముడు దమ్కీ ఇచ్చాడు
పెళ్లికి ముందు రోజు మా తమ్మడు ఫోన్ చేసి దమ్కీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. గోల్డ్, క్యాష్ ఎత్తుకెళ్లినట్లు సీన్ క్రియేట్ చేశారు. నేను ఇంట్లో నుంచి వచ్చి రెండు నెలలైంది. అప్పటి నుంచి లేనిది ఇప్పుడెలా పోయాయి అని గట్టిగా అడగటంతో సైలెంట్ అయిపోయారని... అవినాష్ చెప్పుకొచ్చారు.
డబ్బుకు విలువ ఇవ్వను
నాకు కట్నం తీసుకోవడం నచ్చదు. డబ్బును నమ్మను. డబ్బుకు విలువ ఇచ్చే వారు నాకు నచ్చరు. మనిషికి విలువ ఇచ్చేవారు మాత్రమే నచ్చుతారు. స్వాతి నాయుడు అలాంటి అమ్మాయి కాబట్టే నాకు నచ్చిందని అవినాష్ తేల్చి చెప్పారు.