Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కబీర్సింగ్ మూవీ మత్తులో దారుణం.. లవర్ను చంపిన టిక్ టాక్ స్టార్.. షాక్లో సందీప్ రెడ్డి
సామాన్య ప్రేక్షకులపైనే కాదు సెలబ్రిటీలపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది. టిక్ టిక్ స్టార్గా ప్రజాదరణ పొందిన జానీ దాదా తన ప్రియురాలినే హత్య చేయడం సంచలనం రేపింది. కబీర్ సింగ్ సినిమాకు వీర ఫ్యాన్ అయిన జానీ లవర్నే చంపేశారనే వార్త తెలిసి దర్శకుడు సందీప్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ దారుణం వెనుక అసలు విషయం ఏమిటంటే..
కబీర్ సింగ్ సినిమా ప్రభావంతో
ఉత్తర ప్రదేశ్కు చెందిన టిక్ టాక్ స్టార్ జానీ దాదా అలియాస్ అశ్వినీ కుమార్ ఆకా టిక్ టాక్ విలన్కు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ సినిమా అంటే చెప్పలేనంత ఇష్టం. ఈ టిక్ టాక్ స్టార్కు దుబాయ్ ఫ్లయిట్లో పనిచేసే నికితా శర్మను కొద్దికాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే నికితా మరో వ్యక్తిని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నది.
ప్రేమించిన వ్యక్తి మరొకరితో పెళ్లికి
తాను ప్రేమించిన నికితా శర్మ మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకపోవడంతో టిక్ టాక్ స్టార్ జానీ దాదా గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాల్లో తన అసహనాన్ని వీడియో యాప్లో వెళ్లగక్కాడు. తాజాగా నికితాను దారుణంగా హతమర్చాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి అశ్వినీని అదుపులోకి తీసుకొన్నారు. ప్రాథమిక విచారణలో ఉత్తరప్రదేశ్లో జానీ దాదాపై మూడు హత్య కేసులు ఉన్నట్టు తెలియడంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు.
టిక్ టాక్లో కబీర్ సింగ్ డైలాగ్స్
జానీదాదాను అరెస్ట్ చేసి విచారించగా.. తన టిక్ టాక్ అకౌంట్లో కబీర్ సింగ్ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియోలో నాకు దక్కనిది.. మరొకరికి దక్కడానికి అవకాశం ఇవ్వను అనే కబీర్ సింగ్ డైలాగ్ను తన అకౌంట్లో గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి జానీదాదాను విచారిస్తున్నారు.
షాక్లో సందీప్ రెడ్డి వంగ
తన కబీర్ సింగ్ సినిమాను అమితంగా ప్రేమించే జానీ దాదా ఇలాంటి దారుణానికి పూనుకోవడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మృతురాలి కుటుంబానికి తీవ్ర సంతాపం. దురదృష్టవశాత్తు నికితా విలువైన ప్రాణాలు కోల్పోయింది. నా వృత్తిపట్ల బాధ్యతగా ఉండాలనే స్పృహను కలిగించింది. నా సినిమాలో హత్యలను ప్రేరేపించే విధంగా సీన్లు లేవు అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.