Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సంక్రాంతికి 300 కోట్ల బెట్టింగ్.. టాలీవుడ్లో 4 భారీ సినిమాలు.. అంచనాలు మారితే కష్టమే!
తెలుగు సినిమా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ నిజమైన సినీ పండుగగా మారుతుంది. ప్రతీ ఏడాది భారీ హీరోల సినిమాలను వెండితెరను తాకుతుంటాయి. ఈ ఏడాది కూడా నిజమైన సంక్రాంతిని టాలీవుడ్ తీసుకురాబోతున్నది. జనవరి 9 తేదీన ప్రారంభమయ్యే సినీ సంక్రాంతి వేడుకు జనవరి 12 వరకు కొనసాగనుంది. నాలుగు భారీ బడ్జెట్, సూపర్ స్టార్లు నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటి బిజినెస్ విలువ దాదాపు రూ.300 కోట్లకు పైనే కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..
125 కోట్ల ఎన్టీఆర్ బయోపిక్
2019 సంక్రాంతి బరిలో జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కాబోతున్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. విద్యాబాలన్ కీలకపాత్రలో నటించగా, తెలుగు పరిశ్రమలోని స్టార్ నటులు, దర్శకులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.125 కోట్లకుపైనే.
రూ.25 కోట్ల పేట
ఇక సూపర్ట్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేట చిత్రం జనవరి 10న విడుదల కానున్నది. ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష లాంటి అందాల తారలు, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా నటిస్తున్నారు. తెలుగులో సుమారు 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సినీ వర్గాల టాక్.
రూ.100 కోట్ల రాంచరణ్
జనవరి 11న మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ రిలీజ్ కాబోతున్నది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్గా రూపొందింది. భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వాని హీరోయిన్గా నటించింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.95 కోట్లు అనేది ట్రేడ్ రిపోర్ట్. ఇది రాంచరణ్ కెరీర్లోనే అత్యుత్తమం.
రూ.50 కోట్లతో ఫన్ అండ్ ఫ్రస్టేషన్
ఆ మరుసటి రోజే జనవరి 12న దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) రిలీజ్ కానున్నది. మల్టీస్టారర్గా రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ నటించారు. తమన్నా, మెహ్రీన్ వారికి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.50 కోట్లకుపైనే జరిగిందనేది టాక్.
బ్రహ్మీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్... బెస్ట్ కమెడియన్ ఎవరో మీరే తేల్చండి!
రూ.300 కోట్లతో భారీ బెట్టింగ్
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి రూ.300 కోట్ల బిజినెస్తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమైంది. హై రేంజ్లో జరిగిన బిజినెస్ కారణంగా అందరి దృష్టి టాలీవుడ్ పైనే ఉంది. ఈ నాలుగు సినిమాలు పాజిటివ్తో ముందుకెళ్తే ఈ ఏడాది అంతా తెలుగు పరిశ్రమకు శుభదినాలే కావడం తథ్యం. ఈ నాలుగు సినిమాల విషయంలో ఏదైనా అటూ ఇటూ జరిగితే దాని ప్రభావం ఏడాది మొత్తంపై ఉండే అవకాశం లేకపోలేదు.