Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా చంపేయకండి.. రిలీజ్ చేయడం కష్టమేమి కాదు!
ఒక మనిషి బ్రతికి ఉన్నప్పటి కంటే.. చనిపోయినప్పుడే వారి విలువ ఎక్కువగా తెలుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు మనిషి లోకం విడిచి వెళ్ళేంత వరకు కూడా అర్థం కాదు. ఉదయ్ కిరణ్ లైఫ్ కూడా ఓ విధంగా అలాంటిదే. ఉదయ్ కిరణ్ చివరి సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుందనే కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Recommended Video
ఆ రెండు జీవితాలు..
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనతో మరోసారి ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించిన వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. సుశాంత్, ఉదయ్ కిరణ్ జీవితాలు దాదాపు ఒకే కోణంలో ఉండడం అందరిని ఆశ్చర్యపరిచాయి. చివరికి ఉరి వేసుకునే వరకు ఉదయ్, సుశాంత్ సింగ్ జీవితాలు ఒకేలా ఎండ్ అవ్వడం విషాధకరమనే చెప్పాలి.
టాలీవుడ్ నెపోటీజమ్..
ఉదయ్ కిరణ్ జీవితం గురించి ఎవరికి తెలియనిది కాదు. అతని మృతికి.. కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడమే కారణమని అందరికి తెలిసిందే. అనుకోని అపజయాలు అవకాశాలు లేకుండా చేశాయి అనే కామెంట్స్ కంటే కూడా అతనికి అవకాశాలు రాకుండా చేశారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటీజమ్ అనే పదం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కడం అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. 'చిత్రం చెప్పిన కథ' అనే సినిమాలో ఆఖరి సారిగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఉదయ్ ఆత్మహత్య అనంతరం ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు.
కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే..
ఆర్థిక కారణాల వల్ల కూడా ఆ సినిమాను రిలీజ్ చేయలేదు అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే బావుంటుందని ఓ వర్గం అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అటకెక్కిన సినిమాలు చాలా వరకు ఓటీటీలో ఒక మంచి రేటుకు అమ్మేస్తున్నారు.
అలా చంపేయకండి..
గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ దాదాపు అందరు మర్చిపోయే సమయంలో ఓ వర్గం నెటీజన్స్ కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని కోరడంతో మంచి రేటుకు అమ్మేసి డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా అలా చంపేయకండి అంటూ.. కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని ఓ వర్గం ఆడియెన్స్ కోరుతున్నారు. మరి నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.