Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా చంపేయకండి.. రిలీజ్ చేయడం కష్టమేమి కాదు!
ఒక మనిషి బ్రతికి ఉన్నప్పటి కంటే.. చనిపోయినప్పుడే వారి విలువ ఎక్కువగా తెలుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు మనిషి లోకం విడిచి వెళ్ళేంత వరకు కూడా అర్థం కాదు. ఉదయ్ కిరణ్ లైఫ్ కూడా ఓ విధంగా అలాంటిదే. ఉదయ్ కిరణ్ చివరి సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుందనే కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Recommended Video
ఆ రెండు జీవితాలు..
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనతో మరోసారి ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించిన వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. సుశాంత్, ఉదయ్ కిరణ్ జీవితాలు దాదాపు ఒకే కోణంలో ఉండడం అందరిని ఆశ్చర్యపరిచాయి. చివరికి ఉరి వేసుకునే వరకు ఉదయ్, సుశాంత్ సింగ్ జీవితాలు ఒకేలా ఎండ్ అవ్వడం విషాధకరమనే చెప్పాలి.
టాలీవుడ్ నెపోటీజమ్..
ఉదయ్ కిరణ్ జీవితం గురించి ఎవరికి తెలియనిది కాదు. అతని మృతికి.. కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడమే కారణమని అందరికి తెలిసిందే. అనుకోని అపజయాలు అవకాశాలు లేకుండా చేశాయి అనే కామెంట్స్ కంటే కూడా అతనికి అవకాశాలు రాకుండా చేశారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటీజమ్ అనే పదం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కడం అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. 'చిత్రం చెప్పిన కథ' అనే సినిమాలో ఆఖరి సారిగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఉదయ్ ఆత్మహత్య అనంతరం ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు.
కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే..
ఆర్థిక కారణాల వల్ల కూడా ఆ సినిమాను రిలీజ్ చేయలేదు అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే బావుంటుందని ఓ వర్గం అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అటకెక్కిన సినిమాలు చాలా వరకు ఓటీటీలో ఒక మంచి రేటుకు అమ్మేస్తున్నారు.
అలా చంపేయకండి..
గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ దాదాపు అందరు మర్చిపోయే సమయంలో ఓ వర్గం నెటీజన్స్ కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని కోరడంతో మంచి రేటుకు అమ్మేసి డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా అలా చంపేయకండి అంటూ.. కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని ఓ వర్గం ఆడియెన్స్ కోరుతున్నారు. మరి నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.