Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గర్వంగా ఉంది.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంపై ఉపాసన రియాక్షన్
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ వికటిస్తోంది.. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని.. ఇద్దరు ముగ్గురు చనిపోయారంటూ వార్తలు వైరల్ కాసాగాయి. దీంతో జనాల్లో కరోనా వ్యాక్సిన్ పట్ల అభద్రతా భావం ఏర్పడింది. దాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రచారాలు చేస్తుంది.
అయితే తాజాగా ఉపాసన కూడా తన వంతు బాధ్యతను పూర్తి చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరిట వైద్య సిబ్బందిక, ఆశా వర్కర్లు, పారిశుధ్ద్య కార్మికులను కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఉపాసన ముందుకు వచ్చింది. తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నానని చెబుతూ ఓ ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా జనాల్లో ఉన్న అపోహలపైనా స్పందించింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.. 2020లో ఎదుర్కొన్న వింత పరిస్థితుల నుంచి మనం బయట పడేందుకు ఇదంతా ఆరంభంలా అనిపిస్తోంది.. నా తోటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను..ఈ మేరకు వారు ముందడుగవు వేయాలి. దయచేసి భయపడకండి. ఆలోచించకండి.. అది ఎంతో సురక్షితం.
మన ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మనమంతా కలిసే ఎదుర్కొవాలి.. మామూలుగా నేను ఎప్పుడూ కూడా హాస్పిటల్లోనే ఉంటాను.. ఇప్పుడు ఇది నా దేవాలయం.. దీన్ని సురక్షితంగా ఉంచుకుందాం.. దేశాన్ని కాపాడుకుందామని ఉపాసన చెప్పుకొచ్చింది.