Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అర్జున్ కోసం ‘ఉప్పెన’ స్పెషల్ షో: సినిమా చూసిన తర్వాత స్టైలిష్ స్టార్ రియాక్షన్ ఇదే
పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఉప్పెన'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. మూడు వారాలుగా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న దీనిని ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు సైతం వీక్షించారు. అదే సమయంలో ఈ చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా 'ఉప్పెన'ను మెగా ఫ్యామిలీకి చెందిన టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూశాడు.
'ఉప్పెన' మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బుధవారం రాత్రి స్టార్ హీరో అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా షోను వేయించింది. ఈ సందర్భంగా చిత్ర హీరో పంజా వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత నవీన్ యెర్నేనితో కలిసి స్టైలిష్ స్టార్ ఆ సినిమాను వీక్షించాడు. చిత్రాన్ని చూసిన అనంతరం యూనిట్ను పేరు పేరునా ప్రత్యేకంగా అభినందించాడు బన్నీ. హీరో హీరోయిన్లు కొత్త వాళ్లైనా చక్కగా నటించారని అన్నాడు. అలాగే, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను కొనియాడాడు. వీళ్లతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి యాక్టింగ్ను మెచ్చుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వదిలింది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారానికి 20 రోజులు పూర్తి చేసుకున్న 'ఉప్పెన'.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.96 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇప్పటి వరకు రూ. 28.96 కోట్లు లాభాలను ఆర్జించింది.